
Supreme Court of India
సహజీవన బంధాలను రిజిస్టర్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్ట్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. శ్రద్ధావాకర్ అనే యువతితో సహజీవనంలో ఉండి ఆఫ్తాబ్ అనేయువకుడు ఆమెను కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. శ్రద్ధ హత్య నేపథ్యంలో రాణి అనే పిటిషనర్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేస్తూ…సహజీవన సంబంధాల్లో నేరాలు పెరుగుతున్నాయని…వాటిని అరికట్టేందుకు సహజీవనాన్ని కూడా రిజిస్టర్ చేసేలా నిబంధనలు రూపొందించాలని కేంద్రాన్నిఆదేశించాని విజ్ఞప్తి చేశారు. దానివల్ల సహజీవనం చేసేవాళ్ల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయని…నేరాలకు అడ్డుకట్ట పడుతుందని అందులో పేర్కొన్నారు. అయితే దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం పిటిషనర్ పై మండిపడింది. సహజీవన బంధాన్ని నమోదు చేసి కేంద్రం ఏం చేసుకుంటుందని, ఇలాంటి పిల్ లు వేసి కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని గట్టిగా హెచ్చరిస్తూ కొట్టేసింది.
The Supreme Court on Monday expressed surprise at a PIL which was filed seeking mandatory registration of live-in relationships.
Read more: https://t.co/zoKTnzhVBn#SupremeCourt #liveinrelationship #SupremeCourtOfIndia pic.twitter.com/oZkzzF4nKx— Live Law (@LiveLawIndia) March 20, 2023