సౌదీ అరేబియాకు వెళ్లే యాత్రికులకు అందించే హజ్, ఉమ్రా సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వివిధ ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ టూర్ ఆపరేటర్లు, రాష్ట్రల్లోని హజ్ నిర్వాహకులు.. హజ్ యాత్రికులకు విధించే GSTని సవాలు చేస్తూ దాఖలు చేసిన పదిహేడు పిటిషన్లపై న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, ఏఎస్ ఓకా సహా సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ సర్వీసులకు ఇప్పటికే మతపరమైన కార్యకలాపాలకు సంబంధించినవిగా మినహాయింపు ఉందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం అదనపు ప్రాదేశిక కార్యకలాపాలపై ఎటువంటి పన్ను వర్తించదు అనే కారణంతో GST విధించడాన్ని రిజిస్టర్డ్ ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు సవాలు చేశారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా తీర్థయాత్రకు వెళ్లే కొంతమంది హాజీలకు మినహాయింపు ఇచ్చినందున ఈ ఛార్జీలు వివక్షతతో కూడుకున్నవని వారు వాదించారు.
కేంద్రం అందించే మతపరమైన తీర్థయాత్రల కోసం సేవలను వినియోగించుకునే యాత్రికుల విమాన ప్రయాణంపై 5 శాతం GST ఛార్జీ వర్తిస్తుంది. అయితే, మతపరమైన తీర్థయాత్రకు సంబంధించి ఒక గుర్తింపు పొందిన సంస్థ సేవలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించినట్లయితే, అలాంటప్పుడు ఆ ప్రయాణం ఎలాంటి చార్జీలు ఉండవు.