కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ నుండి మీనా మసీదును తొలగించాలంటూ మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఠాకూర్ కేశవ్ దేవ్ జీ ఆలయంలో కొంత పైభాగం పైన మసీదు నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. శ్రీ కృష్ణ జన్మభూమి ప్రాంగణానికి తూర్పు వైపున ఆ మసీదు ఉంటుంది.
మీనా మసీదును తొలగించాలంటూ అఖిల భారత హిందూ మహాసభ జాతీయ కోశాధికారి దినేష్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 26న కోర్టు ఈ అంశాన్ని విచారించనుందని తెలిపారు. మథురలో దాదాపు డజను కేసుల్లో, శ్రీ కృష్ణ జన్మభూమి తరపున హాజరైన పిటిషనర్లు శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ మరియు షాహి మసీదు మధ్య ఒప్పందాన్ని సవాలు చేశారు.
శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి ఇప్పటికే మధుర కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. షాహీ మసీదు ఈద్గాను అక్కడినుంచి తరలించాలని పిటిషనర్ అభ్యర్థించారు. కృష్ణ జన్మస్థలంపై నిర్మించిన ఈద్గాను తొలగించాలని కోరారు.
ఠాకూర్ కేశవ్ దేవ్ జీ మహారాజ్ ఆస్తులను కాపాడేందుకే తాను ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు దినేష్ శర్మ పేర్కొన్నారు. ఠాకూర్ కేశవ్ జీ మహారాజ్ మధుర నగరంలోని ఆ 13.37 ఎకరాల భూమికి యజమాని. శ్రీకృష్ణ జన్మస్థానం అందులోనే ఉంది. మొఘలులే ఆ స్థలంలో నిర్మించిన మీనా మసీదును తొలగించాలనే డిమాండ్ ఉంది.