నారాలోకేష్ తలపెట్టిన పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్ కు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ సూచించారు. ఈనెల 27 నుంచి ‘యువగళం’ పేరుతో నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపట్టనున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజుల పాటు 4000 వేల కిలోమీటర్ల వరకు టీడీపీ యువనేత పాదయాత్ర సాగనుంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకోడంలో భాగంగా యువగళం పేరుతో ప్రత్యేక జెండా కూడా రూపకల్పన చేశారు.