శ్రద్ధ హత్యకేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆఫ్తాబ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. శ్రద్ధతో మాత్రమే కాక పలువురితో అతనికి సంబంధం ఉన్నట్టు విచారణలో తేలింది. అంతేకాదు శ్రద్ధ శరీర భాగాలు ఇంట్లో ఉండగానే …వేరే అమ్మాయిలను తీసుకువచ్చేవాడు. అగరుబత్తులు, రూమ్ ఫ్రెషనర్లు, పెర్ ఫ్యూములు చల్లడం ద్వారా వాసన రాకుండా జాగ్రత్త పడేవాడు. దుర్వాసన వాళ్లకు చేరకుండా చూసేవాడు. అసలు హత్య జరిగిన కాసేపటికే డేటింగ్ యాప్ బంబుల్ ను ఇన్ స్టాల్ చేశాడు ఆఫ్తాబ్.ఆమె శరీర భాగాలు ఉంచేందుకే ఆఫ్తాబ్ పెద్ద ఫ్రిజ్ ను కొన్నాడు. అసలైతే ఆమె చంపిన తరువాత ఆ మృతదేహాన్ని పారేయాలనుకున్నాడు. కానీ ఎక్కడ ఎలా పడేయాలో తెలియలేదు. గంటలు గడుస్తున్నకొద్దీ శరీరం కుళ్లిపోసాగింది. దీంతో ఫ్రిజ్ కొన్నాడు. శరీర భాగాలను శుభ్రం చేసి అందులో పెట్టాలనుకున్నాడు. అందుకు బ్లీచ్ ను కూడా ఆర్డర్ చేశాడు. అతని కంప్యూటర్ ను తనిఖీ చేసి ఆ సమయంలో ఏమేం ఆర్డర్ చేసి కొన్నాడో గుర్తించారు పోలీసులు. ఆమె బాడీని ముక్కలుగా నరికేందుకు చత్తర్ పూర్ ప్రాంతంలోని స్థానిక దుకాణం నుంచి రంపాన్ని కొన్నాడు.
ఇక ప్రతిరోజూ తెల్లవారుజామున రెండు గంటలకు ఒక్కో శరీరభాగాన్నితీసుకుని దూరంగా వెళ్లి పడేసి వచ్చేవాడు.సోషల్మీడియా పోస్టుల ద్వారా ఆమె ఎక్కడుందో కుటుంబసభ్యులకు తెలిసేది.
ఆమె అప్డేట్లను పోస్ట్ చేయడం ఆపివేయడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందాడు. డిల్లీలో వెదికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫ్తాబ్ పై అనుమానం వ్యక్తం చేయడంతో వారు అతన్ని అరెస్ట్ చేశాడు. విచారణలో నేరం అంగీకరించాడాదుర్మార్గుడు.