బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సులు చేయించారని..అందుకు అనుభవిస్తారంటూ… టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితపై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారని తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. వేములవాడ ఆలయాన్ని ‘ప్రసాదం స్కీం’ కింద అభివృద్ధి చేద్దామంటే… కేసీఆర్ సహకరించడం లేదన్నారు. వేములవాడ అభివృద్ధికి 100 కోట్లు అన్న కేసీఆర్…. ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదని..బాసర అభివృద్ధికీ వందకోట్లు ప్రకటించారని అక్కడా రూపాయి ఇవ్వలేదని అన్నారు. ఇక ఇప్పుడు ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్లు అంటున్నారని, కొండగట్టులో కేసీఆర్ బిడ్డ కవిత ఏదైనా జాగా కొన్నారేమోనని సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందని…ఇప్పుడు డిల్లీలో వీఆర్ఎస్ అవబోతోందనీ అన్నారు.ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా జగిత్యాలలో ఉన్న సంజయ్…సంఘవిద్రోహ శక్తులకు పట్టణం అడ్డాగా మారిందన్నారు.