
అలాగే, ఆ మధ్య నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ఫ్రాడ్ కేసులో జరిగిన అవకతవకలు గురించి అంటే ఆ కంపనీ ఆస్తులు అడ్డదారులో కొట్టేయ్యడానికి ప్రయత్నించిన సోనియాని, రాహుల్ ని ఈడీ ప్రశ్నించడానికి పిలిస్తే కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు దేశ వ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు చేసారు. పార్లమెంటు స్తంభింపచేశారు.
దేనికి ఈ ఆందోళనలు? ఏం సోనియా రాహుల్ ఈ దేశపు పట్టపు రాణి మరియు యువరాజులా? వారు ఈ దేశ రాజ్యాంగానికి, చట్టానికి అతీతులా? వారేమైనా ఏనాడైనా కనీసం రాజ్యాంగపదవుల్లో పనిచేసారా?
దేశంలో గల 543 పార్లమెంటు సభ్యులలో వీళ్ళు ఇద్దరూ కూడా ఉన్నారు..అంతే! అంత కంటే గొప్ప ఏముంది? మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అనే చందంగా వీరి కుటుంబం భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీకి ఒకరు తాత్కాలిక అధ్యక్షురాలు అయితే ఆమె కొడుకు అప్పుడప్పుడు కాలక్షేపానికి ఉతిత్తుత్తి అధ్యక్షుడు.
ఆ మాత్రం పదవులు వెలగబెడుతున్నందుకే దేశ చట్టాలు ప్రకారం ప్రభుత్వ అధికారులకు వీరిని ప్రశ్నించే హక్కు లేదా?
మరి వీరు దొడ్డిదారిన పాలించిన మన్మోహన్ కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కక్ష కట్టి సం. కి ఒక కొత్తకేసు పెట్టి, మత గొడవలపై సుప్రీంకోర్టు చేత సిట్ కూడా వేయించి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ని గంటల సేపు అధికారులు విచారించినపుడు ఏం అనిపించలేదా?
మరి రాష్ట్రంలో నే బాగా పాపులర్ సిట్టింగ్ ముఖ్యమంత్రి , ఒక జాతీయ పార్టీ మద్దత్తు ఉండీ వేల కొద్దీ కార్యకర్తలు ఉన్నారు. మరి మోడీని సిట్ విచారణకు పిలిచినపుడు …
** ఈ కుటుంబ పార్టీలు నాయకుకు లాగే కేంద్ర ప్రభుత్వం మీదకు తన కార్యకర్తలను ఉసి గొల్పారా?
** విచారణ తప్పించుకుందికి సాకులు వెతికారా?
**లేక విచారణ వాయిదా వెయ్యమని కోరారా?
** లేదా విచారణ అనగానే సాధారణంగా రాజకీయనాయకులకి వచ్చే అనారోగ్యం
సాకు చెప్పారా?
** లేక రాష్ట్రంలోనూ దేశంలోనూ పార్టీ కార్యకర్తలు చేత బందులు, ధర్నాలు, వాహనాలు తగలెట్టడాలు చేశారా మోడీ?
లేదే!
2010 మార్చ్ 27న గుజరాత్ పాత సచివాలయ భవనంలోని సిట్ కార్యాలయంలో ఉదయం ఒంటి గంటకు మంది మార్బలం వెంట లేకుండా ఒక్కడే సింహం లా వెళ్ళాడు. 5 గం.ల విచారణ అనంతరం మిగతా విచారణ రేపు చేస్తాం అని చెప్తే, నాకు మర్నాడు ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయి ఎంత రాత్రి అయినా ఈ రోజే విచారణ ముగించమని మోడీ కోరాడు. విచారణ మధ్యలో కనీసం టీ కూడా తీసుకోలేదు అని సిట్ వాళ్ళు చెప్పారు.
మొత్తం 10 గం. ల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘ సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానమిచ్చానని, ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనల క్రమాన్ని సాధ్యమైనంత వరకు గుర్తు చేసుకున్నానని మోదీ పేర్కొన్నారు. సిట్ దర్యాప్తు అధికారులు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని, ఆ తర్వాత తాను సంతకం కూడా చేశానని ముఖ్యమంత్రి మోడీ చెప్పారు”
తనను ఏ విధమైన ప్రశ్నలు అడిగారని అడిగిన విలేకరుల ప్రశ్నకు మోడీ, ” సిట్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉన్నందున ఆ వివరాలు నేను మీతో పంచుకోలేను ” అని అన్నారు.
అల్లర్లలో అతని పేరు గత ఎనిమిదేళ్లుగా ఉన్నాదని ఎత్తి చూపినప్పుడు, “మీరు నన్ను ఇంకా నన్ను దానిలోనే ఉంచారు కదా” అని నవ్వుతూ మోడీ అన్నారు.
“భారత రాజ్యాంగం ప్రకారం, చట్టమే అత్యున్నతమైనది. ఒక సాధారణ వ్యక్తిగా మరియు CM గా నేను భారత రాజ్యాంగానికి మరియు చట్టానికి కట్టుబడి ఉన్నాను. ఎవరూ చట్టానికి అతీతంగా ఉండలేరు” అని చెప్పారు.
“గత ఎనిమిదేళ్లలో ఈ అంశంపై ఎవరైనా నాతో మాట్లాడాలని కోరుకోవడం ఇదే తొలిసారి, నేను దానికి హాజరయ్యాను” అని మోదీ అన్నారు.
తన విమర్శకులపై విరుచుకుపడిన ఆయన .. ‘
‘ఎనిమిదేళ్లుగా నేను మాట్లాడటంలేదని చెప్పిన వారికి దేవుడే బుద్ధి చెప్పాలి. తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారికి, అసత్యాలు ప్రచారం చేసే వారికి ఈ విచారణ ఇలా ఈరోజు జరగడం మంచి బుద్ధి చెబుతుందని ఆశిస్తున్నాను అని ముఖ్యమంత్రి అన్నారు.
సిట్ దర్యాప్తులో సంతృప్తిగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు
మోదీ సమాధానమిస్తూ.. “సంతృప్తి చెందాల్సింది సుప్రీం కోర్టు” , అని సమాధానం ఇచ్చారు
సిట్ను సుప్రీం కోర్టు నియమించిందని,
గుజరాత్కు చెందిన ఒక్క అధికారి కూడా అందులో లేరని ముఖ్యమంత్రి చెప్పారు .
నేడు కొందరు ముఖ్యమంత్రులు చేస్తున్నట్లు అప్పుడు మోడీ ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఏ నాడూ కేంద్ర దర్యాప్తు సంస్థలను తన రాష్ట్రంలో నిషేధించలేదు.
అలాగే తను ముఖ్యమంత్రి గా ఉన్న రాష్ట్రంలోనే తన మీదే విచారణ జరుగుతున్నా మంది మార్బలంతో వెళ్లి హడావుడి చేయకుండా ఒక్కడే వెళ్ళాడు.
అదీ నిజాయితీ ఇచ్చే మానసిక స్టైర్యం.
అయినా ఉదార వాదుల దృష్టిలో మోడీ ఫాసిస్టు.. మిగతా రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య వాదులు.
అందుకే మోడీకి మిగతా కుటుంబ రాజకీయ నాయకులకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కాదు సింహానికి చిట్టెలుకకి ఉన్నంత తేడా?
కుటుంబ రాజకీయ నాయకులను నెత్తిన పెట్టి మోస్తున్న వాళ్ళు ఇప్పటికైనా మోడీకి మిగతా కుటుంబ రాజకీయ నాయకులకు మధ్య తేడా తెలుసుకోవాలి.
….చాడా శాస్త్రి….