ఇప్పటికే తైవాన్ కి చెందిన ఆపిల్ ఐ ఫోన్స్ తయారీ సంస్థలు అయిన ఫాక్సాన్, విస్ట్రాన్ భారత దేశంలో ఆపిల్ ఫోన్స్ తయారు చేస్తూ.. ఎగుమతులు చేస్తూ ఉంటే కొత్తగా అదే దేశానికి చెందిన ఆపిల్ ఫోన్లను తయారు చేసే మూడవ కంపనీ అయిన పెగట్రాన్ భారత్ లో తమ ఐ ఫోన్ల తయారీని వచ్చే నెల ఏప్రిల్ నుంచి మొదలు పెట్టనుంది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇంసెంటివ్ (PLI) స్కీం ని ఉపయోగించుకుని ఈ కంపనీ దేశంలో పరిశ్రమ స్థాపించింది. దీనిలో 6000 మందికి ప్రత్యక్ష ఉపాధి దొరుకుతుంది.
ఈ స్కీం క్రింద సబ్సిడీ పొందడానికి రెండవ సం. (2023లో) ₹8000కోట్లు విలువైన ఫోన్లు ఉత్పత్తి చేయాలి. అలాగే మిగతా ప్రతీ సం. ఉత్పత్తి పెంచుకుంటూ 15 వేల కోట్లు, 20 వేల కోట్లు, 5వ సం. కి 25వేల కోట్లు విలువైన ఉత్పత్తి చేస్తేనే ఈ ఇంసెంటివ్ లభిస్తుంది. ఈ పెగట్రాన్ తయారు చేసే ఫోన్లలో అత్యధిక శాతం ఎగుమతులకు ఉద్దేశించబడతాయి. ఇప్పటికే దేశంలో ఉపయోగించబడుతున్న ఐ ఫోన్స్ లో 70% దేశంలోనే తయారు అవుతున్నాయి.కరోనా కారణంగా పలు అంతర్జాతీయ ఉత్పత్తి సంస్థలు చైనాలో తమ కార్యకలాపాలు నిలిపివేసి ఇతర దేశాలకు తరలిపోతున్నాయి. చైనాలో మళ్ళీ తిరగబెట్టిన కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల మరిన్ని సంస్థలు భారత్ కి వచ్చే అవకాశం ఉంది అని అధికారులు పారిశ్రామిక వేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ చైనా లాక్ డౌన్ మొదలగు తాత్కాలిక పరిణామాలు వల్ల వచ్చే సంస్థలు కంటే భారత్ కనీసం ఒక లక్ష మందికి ఉపాధి ఇవ్వగల పెద్ద పరిశ్రమలు దేశంలో రావాలి. అవి రావడానికి అడ్డంగా ఉన్న కొన్ని చట్టాలను సవరించాలి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
….చాడా శాస్త్రి….