రాజాసింగ్ ఉదంతంలో రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ అల్లర్లకు నేతృత్వం వహించిన సోషల్మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సయ్యద్ అబ్దాహ్ ఖాద్రీపై పీడీ యాక్టు పెట్టారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే అతన్ని అరెస్ట్ చేశారు. వారం రోజులక్రితం మునావర్ ఫారూఖీ షోను నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఓ వీడియో వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. మరునాడు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఆయన బెయిల్ పై విడుదలయ్యాడు. తిరిగి రెండో రోజే పీడీ యాక్ట్ కింద రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రాజాసింగ్ వీడియో వైరల్ అయిన సందర్భంగా పాతబస్తీలో ఓ వర్గం వారు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా సర్ తన్ సే ఝుడా అంటె… తలను, మొండాన్ని వేరు చేయాలి..ఎవరు ఆ పని చేస్తారని పెద్దపెట్టున రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడు సయ్యద్ అబ్దాహ్ ఖాద్రీ. పలువురి ఫిర్యాదుతో ఆరోజే అరెస్ట్ చేసి విడిచిపెట్టారు పోలీసులు. అయితే అతనికి సంబంధించిన నినాదాలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో అతనిపై పీడీయాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారు.
https://twitter.com/hydcitypolice/status/1564535089723502592?s=20&t=W0j9-0P-H9sgbLE6JexG9g
https://twitter.com/CoreenaSuares2/status/1564544458540007424?s=20&t=W0j9-0P-H9sgbLE6JexG9g
మునావర్ ఫారూఖీతో షో నిర్వహణ కోసం అత్యుత్సాహం ప్రదర్శించిందీ సయ్యదే. హైదరాబాద్ తమది…షోను ఎవడు అడ్డుకుంటాడో చూస్తానని సయ్యద్ రెచ్చగొట్టే వీడియోలు చేయడంవల్లే రాజాసింగ్ ఆ వీడియో చేశాడని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు.