హుజురాబాద్ లో లాగానే మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీ 3,4 వేల ఓట్లు తెచ్చుకుంటుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మునుగోడు ఎన్నికల ప్రచారంతో తనకు సంబంధం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాను ప్రచారంలో పాల్గొనబోనని మరోసారి స్పష్టం చేస్తారు. ఢిల్లీలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చారు. పార్టీ తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటరెడ్డి 30ఏళ్లు పార్టీకోసం కష్టపడిన తనను కాదని..నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి పీసీసీ పగ్గాలు అప్పగించారని వ్యాఖ్యానించారు.పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేశారని అందుకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందని అన్నారు. ఇప్పటికైనా కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాలని ప్రజాభిప్రాయం మేరకు పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని కోమటిరెడ్డి అన్నారు. ఇన్నేళ్లు సైనికుడిలా పార్టీకోసం కష్టపడ్డానని, పార్టీని వీడేది లేదని అన్నారు వెంకటరెడ్డి.