ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలుగుతీరింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇతర అగ్రనాయకులు అతిధులుగా విచ్చేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నా ఆయన చుట్టూనే కెమెరాలు సంచరించాయి పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ప్రాంగణం అంతా చప్పట్లతో కేకలతో మార్మోగిపోయింది. రాష్ట్రంలో చాలా చోట్ల జనసేన కార్యకర్తలు స్క్రీన్లు పెట్టుకుని ప్రమాణ స్వీకారం చూసేట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సందడి గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన్ని అభినందించారు అనంతరం పవన్ కళ్యాణ్ ని .. ఆయన అన్నయ్య చిరంజీవి దగ్గరకు తీసుకుని వెళ్లి ముగ్గురు కలిసి ఫోటో దిగడం ఆసక్తికరంగా నిలిచింది. జనసేన నుంచి ముగ్గురికి ఈ మంత్రివర్గంలో అవకాశం కల్పించారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
నిన్న రోజంతా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సందడి కొనసాగింది.
“”పవన్ అనే నేను”” పేరుతో హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని షార్ట్స్ రీల్స్ చేసి సోషల్ మీడియాలో విస్తారంగా సర్కులేట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో పవన్ పేరు మార్మోగిపోయింది మొత్తానికి 25 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తే… మిగిలిన వారి అందరి హడావిడి ఒక ఎత్తైతే,, కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ మరో ఎత్తుగా నిలిచింది.