జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక దీక్ష తీసుకున్నారు. వారాహి అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడే పవన్ .. ప్రస్తుతం వారాహి దీక్ష చేపట్టారు. 11 రోజులపాటు ఈ దీక్షలో ఉంటారు అని తెలుస్తోంది.
పసుపు రంగుని పోలిన దుస్తులను పవన్ కళ్యాణ్ ధరించారు. ఉదయమే నివాసంలో వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ దీక్ష దుస్తులతోనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జనసేన పార్టీ శాసనసభ్యులకు.. అసెంబ్లీ వ్యవహారాల మీద, ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాల మీద అవగాహన శిబిరం నిర్వహించారు.
11 రోజుల పాటు సాగే ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు మాత్రమే తీసుకుం టారు. గత ఏడాది జూన్లో పవన్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. అప్పటి యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో లభించడంతో వారాహి దీక్ష చేపట్టి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటున్నారు.