హత్యాయత్నం కేసులో పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూను పటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు.30ఏళ్లనాటి ఆ కేసులో సిద్దూకు ఏడాదిజైలు శిక్షను విధిస్తూ సుప్రీం ధర్మాసనం. దీంతో సిద్దూ కోర్టులో లొంగిపోయారు.
జైల్లో సిద్దూకు ఖైదీ నెంబర్ 241383 కేటాయించారు. సిద్దూ మొదటిరోజు జైలులో ఎలాంటి ఆహారం తీసుకోలేదని, కేవలం కొన్ని టాబ్లెట్లు మాత్రమే వేసుకున్నారని జైలుఅధికారులు తెలిపారు.
10 నంబర్ గదిలో ఆయనను ఉంచారని.. ఆయనతోపాటు మరో 8 మంది ఆ గదిలో ఉన్నట్టు తెలిసింది.
జైలు భోజనం తినలేక సిద్దూ ఇబ్బందిపడ్తున్నారని తెలిసింది. అయితే వైద్యులు కనుక ఆయనకు ప్రత్యేక భోజనం తినాలని చెప్తే జైలు క్యాంటీన్ నుంచి కొనాలని.. లేదా స్వయంగా వండుకోవచ్చని జైలు అధికారులు తెలిపారు. సిద్దూకు కఠిన కారాగార శిక్ష పడినందున జైలు మాన్యువల్ ప్రకారం ఉండాల్సిఉంటుందని, మొదటి మూడు నెలలు వృత్తి శిక్షణ ఇస్తామని జైలు అధికారులు తెలిపారు. సిద్దూ కు కాలేయసమస్య తోపాటు గోధుమల అలెర్జీ ఉంది. అందువల్ల తనకు ప్రత్యేక డైట్ కావాలని జైలు అధికారులను కోరినట్లు తెలిసింది. జైల్లో సిద్దూకు నాలుగు జతల కుర్తా-పైజామాలు, టేబుల్, కుర్చీ, కప్ బోర్డు, రెండు తలపాగాలు, ఒక జత బూట్లు, పెన్ను సహా కొన్ని ఇతర వస్తువులు ఇచ్చారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ గా పనిచేసిన సిద్దూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్ సర్ ఈస్ట్ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.