తెలుగు సినిమాల్లో క్రైస్తవ పాస్టర్ అంటే దయామయుడు, కరుణామయుడు మాదిరిగానే చూపిస్తూ వచ్చారు. దీంతో సమాజంలో పాస్టర్ అనగానే అందరికీ అటువంటి అభిప్రాయమే ఫిక్స్ అయిపోయింది. కానీ నిజ జీవితంలో మాత్రం పాస్టర్ లు అందరు మనుషుల్లాగానే ఉంటారు, అంతే కాదు చాలా చీకటి పనులు చేస్తూ తప్పించుకొని తిరుగుతుంటారు.
…..
అనేక మందిని అత్యాచారం చేసి తప్పించుకొని తిరుగుతున్న పాస్టర్ బాజిందర్ సింగ్ పాపం పండింది. అత్యాచారం కేసులో క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్ కు పంజాబ్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ‘యేసు యేసు ప్రాఫెట్’ గా సింగ్ పాపులర్ అయ్యాడు.అనేక మంది మీద మహిళల మీద అత్యాచారం చేసినప్పటికీ, బాధితులను భయపెట్టి కప్పి పుచ్చేవాడు.
..
కానీ, బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 2018లో పంజాబ్లోని జిరాక్పూర్ కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. విదేశాలకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పిన బాజిందర్.. తనను భయంకరంగా అత్యాచారాలు చేశాడని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. బాజీందర్ సింగ్కు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
…
బాజిందర్ సింగ్ కు వివాదాలు కొత్త కాదు. ఇటీవల ఆయన తన కార్యాలయంలో ఓ మహిళపైన, మరో వ్యక్తిపైన దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని చెంపలపై కొట్టడం, చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి ఘటనలు.. ఆ వీడియోలో ఉన్నాయి. 2022లో ఓ 22 ఏళ్ల మహిళ.. తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 2022లోనే అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను బాగుచేస్తానని చెప్పి ఆమె కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. అయితే ఆ తర్వాత ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
…
ఇటువంటి ఘటనల ద్వారా అర్థం చేసుకోవాల్సిన వాస్తవం ఒకటి ఉంది. అనేక మంది మాదిరిగానే క్రైస్తవ పాస్టర్ లలో కొంత మంది ఇటువంటి దారుణాలు, అఘాయిత్యాలకు పాల్పడి .. తప్పించుకొని తిరుగుతున్నారు అన్న మాట.