పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల గురించి ప్రత్యేక చర్చనడుస్తోంది. రాష్ట్రంలో క్రైస్తవ మతంలోని మారిన దళితులు గుర్తింపు సమస్యను ఎదుర్కొంటున్నారు. క్రైస్తవాన్ని స్వీకరించినప్పటికీ దళితులుగా వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. దాదాపు దేశమంతటా ఇలాగే ఉన్నా పంజాబ్లో ఎన్నికలు కనుక ఆ రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది.
తాజా నివేదిక ప్రకారం … 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో 1.26% ఉన్న క్రైస్తవులకు రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క ప్రజాప్రతినిధీ లేడు. గురుదాస్పూర్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. పంజాబ్లోని ప్రధాన రాజకీయ పార్టీలు క్రైస్తవులకు అరుదుగా టిక్కెట్లు కేటాయిస్తాయి. అక్కడ ఎక్కువ జనాభా ఉన్న మతం సిక్కులు. గణనీయమైన ఓటు బ్యాంక్ ఉన్నా అసెంబ్లీలో గత కొన్నేళ్లుగా ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యే కూడా లేడు.
పంజాబ్లో ముూడు రకాలైన క్రైస్తవులున్నారు. బ్రిటీష్ కాలంలో తమ పూర్వీకులు మతం మారగా దాన్నే అనుసరిస్తున్నవారు ఒకరకం. ఇక వివిధ డేరాల ప్రభావంలో ఉన్నవారు మరికొందరు. వారిలో ఎక్కువమంది పేదలు, నిరక్షరాస్యులే. ఆ తరువాత పెద్దసంఖ్యలో దళితులు క్రైస్తవంలోకి మారారు. మూడో వర్గం వారు అధికారికంగా క్రైస్తవులుగా మారలేదు కానీ ఆ మతవిశ్వాసాన్ని ఆచారిస్తారు. అయితే ఈ మూడు రకాలైన క్రైస్తవులను ప్రభావితం చేసే నాయకులు ఆ వర్గంలో లేరు. అయినప్పటికీ అక్కడ చర్చి, మిషనరీల ప్రభావం ఉంది.
యూపీలో దళిత రాజకీయాల్ని ప్రభావితం చేసిన మాయావతి తన పార్టీ బీఎస్పీ వైపు పంజాబ్ దళితుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని 98% మంది క్రైస్తవులు దళిత నేపథ్యం నుంచి వచ్చినవారే.
ప్రస్తుత రాష్ట్ర ఆప్ నాయకుడు, రోహిత్ ఖోఖర్ తాను కూడా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నానని, అయితే తాను ఇంకా దళితుడినేని ప్రచారం చేసుకుంటున్నారు. సిక్కు మతం , క్రైస్తవ మతంపై కులవ్యవస్థ ప్రభావాలు ఇంకా ఉన్నాయని..తన వర్గం హక్కుల కోసం పోరాడతానంటున్నారు. మతానికి సంబంధించి…ఏదైనా సమస్య ఉంటే క్రైస్తవుడిగా ఓటేయాలని… దళిత హక్కుల సమస్యలపై స్పందించాల్సి వస్తే దళితుల్లాగా ఆలోచించి ఓటు వేయవచ్చుననీ అంటున్నారు. అప్పుడే రిజర్వేషన్ ప్రయోజనాల్ని దళితులు పొందగలరనీ తన అభిప్రాయంగా గట్టిగా చెబుతున్నారు.
రోషన్ జోసెఫ్ రెండు నెలల క్రితం వరకు గురుదాస్పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడాయన అకాళీదళ్ లో ఉన్నారు. దళిత వర్గం క్రమంగా కాంగ్రెస్ పార్టీ దూరవుతోందని ఆయనంటున్నారు. ప్రకాష్ సింగ్ బాదల్ 1997లో క్రిస్మస్ పండుగను రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా జరిపారని…దళితుల మద్దతును కూడగట్టగలిగారనీ గుర్తు చేస్తున్నారు.
అన్వర్ మసీహ్ అకాలీదళ్ సీనియర్ నాయకుడు , మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియాకు సన్నిహితుడు. 2014లో, అతను ప్రభుత్వం కోసం రిక్రూట్మెంట్ చేసే సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్లో నియమితులయ్యారు. 2020లో అన్వర్ మసీహ్పై ఓ కేసునమోదైంది. అతనింట్లో 197 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో ఆప్ హవా నడుస్తోంది….ఆ హవా దళితుల్నీ చుట్టుముట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ దళిత నేత చరణ్జిత్ సింగ్ చన్నీని ముందుకుతెచ్చింది. ఆయన్నే మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో ఆప్ వైపు మొగ్గుతున్న వాళ్లు పునరాలోచనలో పడి కాంగ్రెస్ కే ఓట్లేయవచ్చన్నదీ ఓ అంచనా.
రాష్ట్రంలో చాలా మంది క్రైస్తవ నాయకులు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారిలో డొమినిక్ మట్టు ఒకరు. ఆయన డేరా బాబా.. నానక్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు చెందిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఆయనకు టికెట్ నిరాకరించింది. అజ్నాలా నుంచి మరో స్వతంత్ర అభ్యర్థి సోనూ జాఫర్ పోటీ చేస్తున్నారు. ఆయనకు టికెట్ కూడా నిరాకరించారు. అజ్నాలాలో మొత్తం 1.5 లక్షల క్రైస్తవ ఓట్లున్నాయి. ఈసారి ఆప్ తనకు టికెట్ ఇవ్వలేదు…క్రితం సారి కాంగ్రెస్ నిరాకరించింది. ఆయా పార్టీలు టికెట్ నిరాకరించకపోవడం వివక్షేనంటూ సానుభూతికోసం ప్రయత్నాలు చేస్తున్నారాయన.
ఈసారి కొత్తతరం నాయకులు పంజాబ్ ఎన్నికల తెరపైకి వస్తున్నారు. టికెట్ రాని దళితక్రిస్టియన్లు సానుభూతి రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రంలోని దళిత క్రైస్తవులు రిజర్వేషన్లు సహా ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులని..తమను గెలిపిస్తే అన్నీ అందేలా చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు.