క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022 ను పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టారు. అదే రోజు లోక్ సభలో… రెండు రోజుల తర్వాత రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. ఉభయసభల ఆమోదం పొందిన తరువాత బిల్లును… ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. రాష్ట్రపతి బిల్లును ఆమోదించగానే అది చట్టంగా రూపొందుతుంది.
ఖైదీల గుర్తింపు చట్టం,1920 ప్రత్యామ్నాయంగా ఈ బిల్లును తీసుకువచ్చారు. 1980లలో లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 87వ నివేదికలో, చట్టంలో గణనీయమైన మార్పులను సిఫార్సు చేసింది. కొత్త బిల్లు, నేరస్థుల తగిన శరీర కొలతలను సంగ్రహించడానికి, రికార్డ్ చేయడానికి ఆధునిక సాంకేతికతలు, విధానాలను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత చట్టం ప్రకారం, దోషుల వేలిముద్ర, పాదముద్రలను మాత్రమే తీసుకోవడానికి అధికారులకు అనుమతి ఉంటుంది.
నేర పరిశోధన కోసం వ్యక్తులకు సంబంధించిన గుర్తింపు సమాచారాన్ని సేకరించేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుంది. సమాచార సేకరణ పరిమితులను విస్తరింపజేస్తుంది. దోషులు, అరెస్టు చేయబడిన వ్యక్తులకు సంబందించిన డేటాను సేకరించే విధంగా ఉపయోగపడుతుంది. ఇది దర్యాప్తులో సహాయం చేయడానికి, ఏ వ్యక్తి నుంచి అయినా సమాచారాన్ని సేకరించడానికి ఆదేశించడానికి మేజిస్ట్రేట్ను అనుమతిస్తుంది. వేలిముద్రలు, అరచేతి ముద్రలు, పాద ముద్రలు, కనుపాప, రెటీనా స్కాన్ వంటి బయోమెట్రిక్ డేటా, DNA నమూనాలతో సహా రక్తం, వీర్యం, లాలాజలం వంటి ఫిజికల్, బయోలాజికల్ నమూనాలు, సంతకం, చేతివ్రాత, వాయిస్ నమూనాల వంటివి కూడా సేకరించే అవకాశం కల్పిస్తుంది ఈ బిల్లు. వ్యక్తి బయోలాజికల్ నమూనాలను ఇవ్వడానికి నిరాకరించవచ్చు, కానీ నేరం మహిళలు, పిల్లలపై నేరానికి సంబంధించినది అయితే.. నేరానికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష విధించబడినట్లయితే ఇక ఆ నిరాకరించడానికి అవదు. అంతేకాదు ప్రతిపాదిత ఈ బిల్లు వ్యవస్థీకృత నేరాలు, సైబర్ నేరాలు సహా నైపుణ్యం కలిగిన ఉగ్రవాదుల నుంచి ముప్పును తగ్గిస్తుంది. వారి ద్వారా ఎదురయ్యే తీవ్రమైన బెదిరింపులను తనిఖీ చేయడానికి ఈ బిల్లు సహాయపడుతుంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)