నీతి ఆయోగ్ సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ను ప్రభుత్వం నియమించింది. ఇది వరకు అయ్యర్ స్వచ్ఛ భారత్ మిషన్కు నాయకత్వం వహించారు. పరమేశ్వరన్ 1981 బ్యాచ్ IAS అధికారి. రెండేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన నీతి ఆయోగ్ సీఈఓగా నియమితులయ్యారు. జూన్ 30తో పదవీకాలం ముగియనున్న అమితాబ్ కాంత్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.