సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కొలువైన కదిలి పాపహరేశ్వరం..
నిమ్మల చరిత్ర ఘనమైనది.. నిర్మల్ జిల్లా అనగానే గుర్తుకు వచ్చేది వాసర సరస్వతి దేవాలయం మాత్రమే కాదు
సహ్యాద్రి పర్వత పంక్తులలో కొలువైన కదిలి అన్నపూర్ణ సమేత పాపహరేశ్వరక్షేత్రం భక్తుల కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే
పాపహరేశ్వరుడు కొలువైన పుణ్య క్షేత్రం.
సహ్యాద్రి పర్వత పంక్తులలో దట్టమైన అరణ్యాలు మధ్యలో సెలయేరులా ప్రకృతి ప్రేమికులను కట్టి పడేసే ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం.
పాపాలను కడతేర్చి మోక్షం కల్పించే మహా పుణ్య క్షేత్రం కదిలే పాపహరేశ్వరాలయం
ఈ ఆలయం నిర్మల్ జిల్లా కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో కొలువై ఉంది.
ప్రతిఏటా శివరాత్రి మహోత్సవాలు మరియు శ్రావణ మాసం లో ప్రత్యేక పూజలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ప్రతి సారి వేడుకలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబావుతుంది
400 ఏళ్ల చరిత్ర గల ఈ కదిలి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది.
ఆనాడు పరుశురాముడు తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తల్లి రేణుక ఎల్లమ్మ మాతను సంహరించగా
తల్లి (స్రీ)హత్య పాతకం
ఆ పాపవిముక్తి కై తండ్రి ఆజ్ఞ మేరకు పరుశురాముడు కదిలిలో 39 భు ప్రదక్షణ అనంతరము 39 వ మట్టి శివలింగాన్ని ప్రతిష్టించి పాపవిమోచనం పొందినట్లు చరిత్ర చెబుతోంది.
గోదావరి పరివాహక ప్రాంతం అరణ్యములో మట్టి శివలింగాన్ని ప్రతిష్టించి గోదావరిలో స్నానము ఆచరించి శివుడిని కొలిచి పాప విముక్తి పొందడం వల్ల ఈ పుణ్య క్షేత్రానికి కదిలే పాపహరేశ్వరము అనే పేరు వచ్చింది.
పరశురాముడికి నంది వాహన సమేతుడిగా శివ పార్వతులు ప్రత్యక్షము అయి పరుశురాముడుకి తల్లి హత్య పాతక విముక్తిని కల్పించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.
దానికి నిదర్శనం కదిలి ఆలయానికి ముందు 1 మైలు దూరంలో 4 నంది పాద ముద్రలలో ఒకటి ప్రత్యక్షంగా మనము నేటికీ చూడగలుతున్నాము.
మిగతా మూడు నంది
పాద ముద్రలు ముష్కరుల దాడిలో ధ్వంసం అయినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.
పరశురాముడు పాపవిముక్తి పొందడంతో ఈ ప్రాంతం కదిలి పాపహరేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయం ముఖ ద్వారము పడమర దిశగా ఉండటం మరో విశేషం. ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి వచ్చిన సమయంలో పెద్ద శబ్దంతో ఆలయ ముఖద్వారం పడమర దిశగా మారినట్లు భక్తులు చెబుతుంటారు.
ఈ ఆలయ సమీపంలో ఋషి గుండంతో పాటు 18 రకాల చెట్లతో కూడిన మహావటవృక్షం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఋషిగుండంలో స్నానాలు ఆచరించి వటవృక్షం చుట్టు ప్రదక్షణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతీ సోమవారం రోజున విశేష పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్రాపణమాసంలో ప్రతీ శని, సోమవారాల్లో స్వామివారికి అభిషేకార్చనలతో పాటు అన్నపూజలు నిర్వహిస్తుంటారు.
ఈ ఆలయ వెనుక భాగంలో అన్నపూర్ణమాత కొలువుదీరడం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. అన్నపూర్ణమాత కొలువైనందున ఇక్కడ నిత్యాన్నదానం కొనసాగుతుంది. సంవత్సరంలో 365 రోజుల పాటు నిత్యాన్నదానం కొనసాగుతుంటుంది. అలాగే ఈ ఆలయంలో దోషనివారణ పూజాలు సైతం విశేషంగా కొనసాగుతుంటాయి.
తెలంగాణ ప్రాంతవాసులతో పాటు ఏపీ, మహరాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ దోష నివారణ పూజలు చేయిస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.
మహా శివరాత్రి రోజున వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలివస్తుంటారు.
ఇటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలతో పాటు పక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతుంటారు. దీనికి అనుగుణంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి మహా శివరాత్రి పర్వదినాన స్వామి దర్శనంతో పాటు అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణోత్సవాన్ని
కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
శ్రావణ మాసం లో ఈ పుణ్య క్షేత్రం లో భజన ఇతర సాంస్కృతిక కార్యక్రమలు జరిపి స్వామి వారి సేవలో తరించి ఆలయంలోనే నిద్రిస్తారు.
ఈ కదిలి పాపహరేశ్వర పుణ్య క్షేత్రన్ని దర్శించుకున్నా భక్తులు దిలావర్పూర్ లో స్వయంభూగా వెలిసిన రేణుక ఎల్లమ్మ ని అదే విధంగా కాల్వ నరసింహ స్వామిని కూడా భక్తులు దర్శించుకుంటారు.
More Photos :