రోడ్డు ప్రమాదానికి గురై డెహ్రాడూన్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నటీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు మ్యాక్స్ ఆస్పత్రి వైద్యులు. పంత్ కుడికాలు లిగ్మెంట్ కాస్త జరగడంతో పాటు నుదురుభాగంలో చిట్లిన గాయాలు గుర్తించినట్టు వైద్యులు తెలిపారు.మెదడు, వెన్నెముకకు సంబంధించి ఎంఐఆర్ స్కాన్ లో ఎలాంటి సమస్య లేదని వైద్యులు తెలిపారు. మంగళూరు సమీపంలో పంత్ కారు డివైడర్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు ఆయన్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. పంత్ కు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ..ఆయన కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించారు.పంత్ త్వరగా కోరుకోవాలని కాంక్షిస్తూ ట్వీటీ చేశారు.
https://twitter.com/ani_digital/status/1608847126930554881?s=20&t=mShfDhI-MlvR_bJ7CC9_ZA