పాన్ కార్డు నంబర్ను ఆధార్ కార్డు నంబర్తో లింకు చేయాలని.. లేదంటే జరిమానా విధిస్తామంటూ ఇటీవల ఐటీశాఖ ప్రకటన గురించి తెలిసిందే. అయితే ఐటీ శాఖ ఇచ్చిన గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తుండటంతో.. అంతా టెన్షన్కు గురయ్యారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఐటీశాఖ వినియోగదారులకు ఉపశమనం కలగించే ప్రకటన విడుదల చేసింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ గడువును పొడగిస్తూ ప్రకటన విడుదల చేసింది. 2021 జూన్ 30వ తేదీ వరకు ఆధార్,పాన్ నంబర్లను లింకు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ఐటీశాఖ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.