కశ్మీర్ హిందువుల మారణహోమాన్ని, గోవుల స్మగ్లర్లపై దాడితో పోలుస్తూ ఓ ఇంటర్వ్యూలో నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కశ్మీర్లో హిందువుల హత్యలు, పశువుల స్మగ్లర్లైన ముస్లింలపై దాడి ఒకటే అనేలా ఆమె మాటలున్నాయి. త్వరలో రిలీజయ్యే విరాటపర్వం అనే సినిమాలో సాయిపల్లవి నక్సలైట్ పాత్ర పోషిస్తోంది. పల్లవి పాత్ర ప్రేమలో పడే నక్సల్ లీడర్గా రాణా నటించాడు.
నక్సలైట్ పాత్ర చేసిన మీకు వామపక్షఉద్యమ నేపథ్యం ఉందా అని అడగ్గా… నేను రైటిస్టు కుటుంబంనుంచో లేక లెఫ్టిస్ట్ కుటుంబం నుంచో రాలేదని చెబుతూ…ఇటీవల రిలీజైన వివేక్ అగ్నిహోత్రి సినిమా కశ్మీర్ ఫైల్స్ గురించి పల్లవి ప్రస్తావించింది…. హిందువులను చంపారని సినిమా తీశారు మరి కోవిడ్ సమయంలో గోవులను వాహనంలో తరలిస్తున్న ముస్లింలమీద శ్రీరామ్ అంటూ దాడి చేసి చంపారు కదా అదీ తప్పుకదా అని పల్లవి అంది ఆ ఇంటర్వ్యూలో. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు సైతం పల్లవిని ట్రోల్ చేస్తున్నారు.
తటస్థంగా ఉండు ఎవరు కాదన్నారు. కానీ కశ్మీర్ పండిట్ల హత్యలను ఆవుల స్మగ్లర్లపై దాడితో పోలుస్తావా..ఎంతమంది పండిట్లను చంపారో తెలుసా. లోయలో ఎంత మారణకాండ జరిగిందో తెలుసా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
https://twitter.com/Incognito_qfs/status/1536779522066231296?s=20&t=98SCbvAq2QmXw-J-YmmVVQ
బట్టా కశ్మీరీ అనే నెటిజన్ పల్లవిపై మండిపడుతూ… ఓ ముస్లిం డ్రైవర్ పై ఎవరో దాడి చేస్తే కశ్మీర్ మారణహోమంతో పోలుస్తూ జాలి చూపిస్తావా.. ఓ సారి కశ్మీర్ వచ్చిధ్వంసమైన మా ఇళ్లు, విరిగిన మా హృదయాలూ వచ్చి చూడండి. మారణహోమానికి సాక్షులం ఇంకా మౌనంగా ఉన్నాం అంటూట్వీట్ చేశారు.
https://twitter.com/BattaKashmiri/status/1536739337890516994?s=20&t=QccnjtOFmy1Msh55z16GRA
అసలు కశ్మీర్ లోఏం జరిగిందో సాయి పల్లవికి తెలియదని…పవన్ దురానీ అన్నారు. ఓసారి శరణార్థి శిబిరాలను ఆమె దర్శిస్తే మంచిదని అన్నారు. ఆమెపై మాకెలాంటి ద్వేషం లేదు. కానీ కశ్మీర్ ఫైల్స్ సినిమా తరువాతే మాకు జరిగిన అన్యాయం గురించి దేశం మొత్తానికి తెలిసిందని…కానీ ఓ గోవుల స్మగ్లర్ పై దాడితో లోయలో మారణహోమాన్ని పోల్చడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. శరణార్థి శిబిరానికి ఆహ్వానిస్తున్నా..అప్పుడైనా ఆమె కళ్లు తెరుచుకుంటాయేమో అని ఆవేదనగా అన్నారు పవన్.
https://twitter.com/PawanDurani/status/1536739096302718977?s=20&t=Oir46sbjrh_jWCUIY1dxmw
ఏం జరిగిందో తెలుసుకోకుండా ఉపన్యాసాలివ్వడం మానుకోవాలని సాయిపల్లవిని హెచ్చరికతో కూడిన హితవు పలికారు ప్రవీణ్ రెడ్డి అనేమరో నెటిజన్.
https://twitter.com/BattaKashmiri/status/1536739337890516994?s=20&t=yF5h_MF8DjyTl_S0JiwSDw
ఆ ఇంటర్వ్యూలో నక్సలైట్లను పూర్తిగా సమర్థించేలా ఆమె మాటలు ఉన్నాయి. తమ ప్రజలను రక్షించుకోవడానికి ఆయుధం పట్టడమే మార్గమని భావించారని చెప్పుకొచ్చింది.
అసలైతే కశ్మీర్ అంశం ఎన్నిటికీ సున్నితమైనదే. ఇక 33 ఏళ్లనాటి పండిట్లు, హిందువుల తరిమివేత లోయలో ఓ కల్లోల ఘటన. అలాంటి సందర్భాన్ని, అక్కడి హిందువులపై హింసను పశువుల స్మగ్లర్లతో పోల్చింది. అక్రమంగా ఆవులను తరలిస్తున్న స్మగ్లర్లపై స్థానికులే పలుమార్లు దాడిచేసి కొట్టారు. గోరక్షక్ ,బజరంగదళ్, వీహెచ్పీ వంటి సంస్థలు అలాంటి స్మగ్లింగ్ ను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఉంటారు. రైతులనుంచి గోవులను దొంగలిస్తున్న ఘటనలు ఎన్నో. అలాంటి సందర్భాల్లో స్మగ్లర్లకు వంతపాడుతూ సాయిపల్లవి మాట్లాడడంపై మండిపడుతున్నారు. ఇంతకాలం ఆమెను అభిమానిస్తున్నవాళ్లూ సాయిపల్లవి తన నైజం బయటపెట్టుకుందని, ఇకమీదట ఆమె సినిమాలు చూడబోమని అంటున్నారు.