తనను సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి బయటపడేసిన కీవ్ లోని భారత రాయబార కార్యాలయానికి , ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది పాకిస్తాన్ బాలిక.
కీవ్ ప్రాంతం నుంచి భారత అధికారుల సాయంతో బయటపడిన అస్మా షఫీక్ అక్కడి నుంచి పశ్చిమ ఉక్రెయిన్ కు చేరుకుంది. తనను కాపాడిన భారత అధికారులకు, మోదీకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కీవ్ లో చిక్కుకుపోయిన ఆ విద్యార్థి పశ్చిమ ఉక్రెయిన్ చేరుకుంది. తాము క్లిష్ట పరిస్థితుల్లో, దిక్కుతోచని స్ధితిలో ఉన్న సమయంలో కీవ్ లోని భారత రాయబార కార్యాలయం కాపాడిందని ఆమె అన్నారు. భారతీయుల వల్లే తాము భద్రంగా ఉన్నామన్నారు అస్మా.
#WATCH | Pakistan's Asma Shafique thanks the Indian embassy in Kyiv and Prime Minister Modi for evacuating her.
Shas been rescued by Indian authorities and is enroute to Western #Ukraine for further evacuation out of the country. She will be reunited with her family soon:Sources pic.twitter.com/9hiBWGKvNp
— ANI (@ANI) March 9, 2022
అంతకుముందు బంగ్లాదేశ్ జాతీయుడిని ఇండియన్ ఎంబసీ కాపాడింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరాలు ప్రకారం ఆపరేషన్ గంగా కింద ఓ నేపాలి పౌరుడు కూడా భారతీయ విమానంలో రానున్నారు. ఉక్రెయిన్ నుంచి భారత అధికారులు తీసుకువస్తున్న మొదటి నేపాలీ రోషన్ ఝా. భారత ప్రభుత్వం అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలంటూ ది ఖాట్మండూ పోస్ట్ నివేదించింది. ఇక సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా నగరం దాటించారు. ఆపరేషన్ గంగా కింద వారిని స్వదేశం చేర్చేందుకు ప్రత్యేక విమానాలు సిద్ధం చేశారు. సుమీ నుంచి అందర్నీ… పోల్టావాకు తీసుకువెళుతున్నారని, అక్కడి నుంచి పశ్చిమ ఉక్రెయిన్కు రైళ్లలో చేరుకుంటారని… MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. పోల్తావా సుమీ నుండి 175 కి.మీ దూరంలో ఉంది. ఈ విషయాన్ని వివరిస్తూ బాగ్చీ ట్వీట్ చేశారు.
Happy to inform that we have been able to move out all Indian students from Sumy.
They are currently en route to Poltava, from where they will board trains to western Ukraine.
Flights under #OperationGanga are being prepared to bring them home. pic.twitter.com/s60dyYt9U6
— Randhir Jaiswal (@MEAIndia) March 8, 2022
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)