పాకిస్తాన్ జిందాబాద్ పాటను పెద్ద సౌండ్ పెట్టి పదే పదే వింటూ అందరికీ వినిపిస్తున్న యూపీకి చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన మొబైల్ ఫోన్ ద్వారా ఆసాంగ్ ను పదే పదే ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పాకిస్తాన్ అనుకూల పాటను, నినాదాన్ని ప్లే చేస్తూ జాతి సమగ్రతకు భంగం కల్పిస్తున్నాడంటూ నయీమ్, ముస్త్కిమ్ లపై కొందరు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరూ బరేలీలోని భూటా పోలీస్ స్టేషన్ పరిధి సింఘై కలాన్ గ్రామానికి చెందిన వారు.
रमज़ान का पवित्र महीना चल रहा है और बरेली में मुस्तकीम व नहीम पाकिस्तान ज़िंदाबाद के गाने बजाये जा रहे हैं !
इस देश में रह रहे हो..इस देश का खा रहे हो ..पी रहे हो..संशाधनों का उपयोग कर रहे हो और फिर भी पाकिस्तान ज़िंदाबादतुम्हारे जैसे ग़द्दार और नमकहराम पूरी दुनियाँ में नहीं👎 pic.twitter.com/KUTvLsvThG
— Major Surendra Poonia (@MajorPoonia) April 15, 2022
కొన్నిరోజులుగా ఆ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సాగే ఆ పాటను ప్లే చేస్తుండడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు కొందరు ఈ వీడియో ఆధారంతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దేశంలో భారత వ్యతిరేక, పాకిస్తాన్ అనుకూల నినాదాలు కొత్తేం కాదు. యూపీలో అయితే ఈమధ్య వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈఏడాది ప్రారంభంలో ఓ ఊరేగింపులో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపించాయి. ఆవీడియో వైరల్ కావడంతో నోయిడాకు చెందిన నిందితుల్ని అరెస్ట్ చేశారు. అందులో మిలాద్ ఉన్ నబీ సందర్భంగాతీస్తున్న ఊరేగింపులో త్రివర్ణ పతాకం చేతబట్టినట్టు కనిపించింది. కానీ అందులో కొందరు వ్యక్తులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. వారి చేతుల్లో పాకిస్తాన్ జెండా ఉంది.దీంతో వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.