పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని…శ్రీలంకలా తయారవుతోందని పాకిస్తాన్ సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
అటు పాక్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేషనల్ అసెంబ్లీ రద్దుపై తీర్పును ఆ దేశ సుప్రీం కోర్టు రిజర్వ్ చేస్తూ… అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. అయితే మరికొన్ని గంటల్లో తుదితీర్పు ఇవ్వనున్నట్టు సమాచారం. పాక్ లో సుస్థిరమైన గవర్నమెంట్ ఏర్పాడాలని ఆకాంక్షిస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అటు ఇమ్రాన్ తీరుపై నిరసనలు వెల్లువెత్తూనే ఉన్నాయి. సొంతపార్టీలోనే కొందరు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే న్యాయవ్యవస్థనూ, సుప్రీంకోర్టునూ సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా… తన కేబినెట్ లో పనిచేసిన ఫవాద్ చౌదరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇమ్రాన్కు వ్యతిరేకంగా వస్తే దేశం 5 దశాబ్దాలు వెనక్కు వెళ్తుందన్న వ్యాఖ్యలపై ఆ దేశంలో దుమారం రేగుతోంది. విపక్షాలు విదేశాలతో చేతులుకలిపి ప్రభుత్వంపై కుట్ర చేశాయనీ ఆయనంటున్నారు.