అవిశ్వాసం తీర్మానం ముంగిట కొత్తరాగం అందుకున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్. మరోసారి మతాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. పదవీచ్యుతుడవం ఖాయమని తేలడంతో తనపై, దేశంపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. ప్రజల మద్దతుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నఆయన ఇస్లామాబాద్ భారీ బహిరంగ సభ వేదిగ్గా మతాన్ని పదేపదే ప్రస్తావించారు. ఎన్నడో దేశ ఆవిర్భావంనాటి పరిస్థితుల్ని గుర్తు చేశారు. పాకిస్తాన్ ఏర్పాటును హిందుస్థాన్లోని ముస్లింలు సమర్థించారని వ్యాఖ్యానించారు. అంతేకాదు దేశంలోని తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో విదేశీశక్తుల హస్తం ఉందని ఆరోపించారు. నా ప్రభుత్వం ఉన్నా, కూలిపోయినా దేశద్రోహులను వదిలిపెట్టబోనని హెచ్చరించారు.
తన పదవికి అతిపెద్ద ముప్పును ఎదుర్కొంటున్న ఇమ్రాన్ …ఆదివారం ఇస్లామా బాద్ లో భారీ సమావేశాన్ని నిర్వహించారు. మహ్మద్ ప్రవక్త సూత్రాల ఆధారంగా పాకిస్తాన్ లో “రియాసత్ ఇ మదీనా”ని పునఃసృష్టించాలనే తన వాదనపై పదేపదే వెనక్కి తగ్గారు.
పశ్చిమ యూరప్ , స్కాండినేవియాలోని ఇస్లామేతర దేశాలను, జిన్జియాంగ్లోని ముస్లిం సమాజాన్ని చైనా హింసిస్తున్నప్పటికీ… చైనా ఇస్లామిక్ సూత్రాలను అనుసరిస్తోందని ఆయన ప్రశంసించారు. ఇక భారత్ లోని ముస్లింలు కూడా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారని ఇమ్రాన్ అన్నారు. భారతీయ ముస్లింలు అసలు రియాసత్ ఇ మదీనా ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారని..అందుకే పాకిస్తాన్ ఏర్పాటుకు ఓటేశారనీ చెప్పుకొచ్చారు.
https://twitter.com/erbmjha/status/1508091956584345602?s=20&t=mr7dD1FUmLhUom-hkKP8Hg
1946లో భారతదేశంలో జరిగిన ఎన్నికల డేటా ప్రకారం ముస్లింలలో ఎక్కువ మంది ముస్లిం లీగ్కు ఓటు వేశారని ..అంటే పాకిస్తాన్ ఏర్పాటును కోరుకున్నట్టేనని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటం, ద్రవ్యోల్బణం పెరగడం ,ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినందుకు దేశం ఇప్పటికీ FATF గ్రే లిస్ట్లో ఉన్నందున ఇక ఇమ్రాన్ మతం గురించి మాట్లాడ్డం మొదలు పెట్టారు. తన ప్రసంగంలో విపక్షాలపై ఏమాత్రం కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. తన ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ ప్రజామద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేశారు.
విపక్షాలన్నీ ఏకమవడం, పాకిస్తాన్ సైన్యం సైతం సాయం చేయడానికి విముఖంగా ఉండడంతో తన పదవి కాపాడుకునేందుకునానా పాట్లు పడుతున్నాడు. అందులో భాగంగా ఆ దేశపు రాజకీయనాయకులందరిలానే మతంపై జూదం ఆడుతున్నాడు.