ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ పాకిస్తాన్లో కొందరు దుండగులు హిందూ ఆలయాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. కరాచీ కోరంగిలోని ఆలయంలో దాడి జరిగింది. హనుమాన్ విగ్రహం సహా ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ప్రవక్త గురించి మతగ్రంథంలోని అంశాల్ని కోట్ చేసి మాట్లాడిన నూపుర్ శర్మను తప్పుబట్టిన ఇస్లామిస్టులు హిందూ ఆలయాల ధ్వంసం గురించి ఏం మాట్లాడతారని భారతీయులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ధ్వంసానికి సంబంధించిన వీడియో సోషల్మీడియోలో వైరల్ అవుతోంది.