
…………
పాకిస్తాన్ భూభాగం నుంచి దశాబ్దాలుగా సంస్థలను ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని హరీష్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల్లో 20 వేల మందికి పైగా భారతీయులు మరణించినట్లు చెప్పారు. ఈ ప్రాణాలకు ఎవరు జవాబు ఇస్తారు అంటూ హరీష్ నిగ్గదీసి అడిగారు. ‘ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రం’గా ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాదంపై ప్రసంగించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. దొంగ చాటుగా దొంగ దెబ్బ తీయడమే పాకిస్తాన్ కు తెలిసిన విద్య అని ఆయన మండిపడ్డారు అమాయకులైన పౌరులను చంపడం పాకిస్థాన్కు అలవాటైపోయిందని బయట పెట్టేశారు.
………
సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంలో అసలు విషయాన్ని హరీష్ వెల్లడించారు.
సింధు జలాల అంశంలో భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. 65 ఏళ్ల క్రితం భారత్ చిత్తశుద్ధితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని, ఆరున్నర దశాబ్దాల్లో పాకిస్థాన్ మూడు యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. అలాగే, ఒప్పందం జరిగి 65 ఏళ్లు అవుతోందని, కాల క్రమేనా కొన్ని పాత ఆనకట్టలతో భద్రతా సమస్యలు తలెత్తాయని, వాటి మరమ్మతులకు పాకిస్థాన్ అడ్డుకుంటుందని ఐరాస దృష్టికి తీసుకొచ్చారు. అటువంటి పాకిస్తాన్ కి ఇప్పుడు ప్రశ్నలు వేసే అధికారంలేనేలేదని హరీష్ కొట్టి పారేశారు.
………
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. రక్షణ కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ ఐరాస ప్రతినిధులను డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ వైఖరిని గమనించాలని లెక్కలతో సహా ఆయన వివరించి చెప్పారు.
………..
పూర్తి సాక్షాదారాలతో భారత్ చేసిన ప్రసంగానికి… పాకిస్తాన్ తరుపున ఉన్న ప్రతినిధులకు నోట మాట రాలేదు. భద్రత మండలి సమావేశంలో భారత దూకుడు కి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాలేదు. మొత్తం మీద తెలుగువాడైన పర్వత నేని హరీష్ భారతదేశం గొప్పతనాన్ని ఐక్యరాజ్యసమితిలో అందరికీ తెలియజేశారు.