పదవి పోయిన తరువాతా భారత్ పై అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు పాకిస్తాన్ తాజామాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తన పదవి పోవడంతో భారత్, ఇజ్రాయెల్ దేశాలు సంబరాలు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం పడిపోవడం వెనక విదేశీశక్తుల కుట్ర ఉందని కొన్నిరోజులుగా ఆరోపిస్తున్న ఇమ్రాన్..ఇప్పుడు ఏకంగా భారత్ పేరెత్తారు. పాకిస్తాన్ ను అమెరికా అవమానించిందన్న ఇమ్రాన్…తాను పదవిలో ఉన్నప్పటికన్నా ప్రమాదకారినని అన్నారు. అమెరికా, భారత్ వంటి దేశాలపైనా కాదు…స్వదేశంలోని న్యాయవ్యవస్థ తీరునూ ఎండగట్టారు. అర్థరాత్రి సమయంలో కోర్టులు ఎలా తెరుచుకున్నాయని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణ కోసం పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఏప్రిల్ 9న రాత్రి తెరుచుకున్న సంగతి తెలిసిందే.
ఈ తీర్మానంపై అర్ధరాత్రి ఓటింగ్ను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ కైజర్ ఓటింగ్ను నిర్వహించలేదు. ఆయన తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఓటింగ్ జరిగింది. మరో పిటిషన్పైనా ఇస్లామాబాద్ కోర్టు అర్థరాత్రి విచారణ చేసింది.