పంజాబ్లోని మొహాలీలో ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో బాంబు పేలుళ్లు జరిగిన రెండు రోజుల తర్వాత కొత్త ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది.పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) భారతదేశంలో అశాంతిని వ్యాప్తి చేయడానికి ‘లష్కర్-ఎ-ఖల్సా’ అనే మరో ఉగ్రవాద సంస్థను సృష్టించిందని IB హెచ్చరించింది.
నివేదికల ప్రకారం, కొత్త గ్రూప్ ‘లష్కర్-ఎ-ఖల్సా’ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉందని, భారతదేశంలో వారి దుర్మార్గపు ప్లాన్ లను అమలు చేయడానికి వ్యక్తులను రిక్రూట్ చేస్తోందని.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ దేశంలో అశాంతిని నెలకొల్పేందుకు ప్రత్యేక బృందాన్ని రూపొందించిందని IB హెచ్చరిక జారీ చేసింది. ‘అమర్ ఖలిస్తానీ’ అనే మారుపేరుతో ఒక పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఫేస్బుక్ ఐడి ద్వారా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి కొత్త రిక్రూట్మెంట్లను పెంచడానికి చురుకుగా ప్రయత్నాలు చేస్తోంది” అని ఐబి తన హెచ్చరికలో పేర్కొంది.
భారతదేశంలో అతిముఖ్యంగా జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్ఘన్ జాతీయులను రిక్రూట్ చేయడానికి “లష్కర్-ఎ-ఖల్సా” అనే ఈ కొత్త సంస్థను స్థాపించడానికి ISI యోచిస్తున్నట్లు వారు తెలుసుకున్నారని IB తెలిపింది. కాశ్మీర్లోని ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులను మరియు కశ్మీర్లోని భారత వ్యతిరేక మద్దతుదారులను ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి ISI తన కశ్మీర్-ఖలిస్తాన్ (K2) విభాగాన్ని కూడా తిరిగి యాక్టీవ్ చేసింది. కే2 సహాయంతో పంజాబ్, కాశ్మీర్లోని సెంటిమెంట్లను ఉపయోగించుకోవాలని ISI భావిస్తోందని నివేదిక పేర్కొంది.