ట్విట్టర్ లో తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తోన్న అకౌంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న స్ట్రైక్ లో భాగంగా భారతదేశంలో చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ బ్రాడ్కాస్టర్ ‘రేడియో పాకిస్తాన్’ ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారు.
https://twitter.com/shashank_ssj/status/1541408520155037696?s=20&t=37zEG7L-TtF8_z1XYiPGbw
ట్విట్టర్ అధికారుల ఈ చర్య తర్వాత వారి అధికారిక హ్యాండిల్ @RadioPakistan లోని ట్వీట్లు ఇప్పుడు భారతదేశంలో కనిపించవు. 929,000 మంది ట్విట్టర్ ఫాలోవర్లతో ఉన్న ఖాతా సోషల్ మీడియాలో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో 2019లో కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించడం.. కాశ్మీర్పై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడంపై రేడియో పాకిస్తాన్ బులెటిన్ల ప్రత్యక్ష ప్రసారాన్ని Facebook బ్లాక్ చేసింది.