పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి అవకాశం ఇవ్వడం బీజేపీలో ఆనవాయితీ. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఎప్పటినుంచో ఏపీ బీజేపీలో కష్టపడి పని చేస్తున్న పాకా సత్యనారాయణకు తగిన గుర్తింపు లభించింది. పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వాన్ని ఏకగ్రీవంగా కేటాయించారు.
వెనుకబడిన వర్గాలకు చెందిన పాకా సత్యనారాయణ స్వస్థలం భీమవరం.
చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్లో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. 1978లో భీమవరం డీఎన్ఆర్ కళాశాల ఏబీవీపీ కాంపస్ ఇన్ఛార్జ్గా సేవలందించి 1980లో బీజేపిలో చేరారు. అప్పటినుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తూ వస్తున్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, భీమవరం అసెంబ్లీ కన్వీనరుగా, నరసాపురం పార్లమెంట్ కన్వీనరుగా పలు పదవులు నిర్వహించారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యునిగా, బీజేపీ ఉపాధ్యక్షునిగా, పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించినా, ఆఖరు నిమిషంలో సోము వీర్రాజు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆయనకు నిరాశ ఎదురయింది. కానీ ఇప్పుడు ఆయనకు అంతకన్నా మెరుగైన పదవి లభించింది.
పార్టీని అంటిపెట్టుకొని క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని బిజెపి మరోసారి రుజువు చేసింది. మొన్నటికి మొన్న సోము వీర్రాజు, తాజాగా పాకా సత్యనారాయణ ఎంపికతో ఈ విషయం నిర్ధారణ అయింది.