బురఖా వివాదంపై ప్రియాంక గాంధీ చేసిన తప్పుడు సమాచారాన్ని పాకిస్తాన్ అందుకుంది. భారత్ లో ముస్లిం బాలికల విద్యాహక్కును హరిస్తున్నారని…స్వయంగా అక్కడి విపక్ష పార్టీనే అంటోందని ఆదేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి అన్నారు. ఫిబ్రవరి 9న 2022న ప్రియాంక చేసిన ట్వీట్ ను షా మెన్షన్ చేస్తున్నారు.
కర్నాటక హిజాబ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ… భారత్ లో విద్యార్థినుల రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్నారని ఆమె ట్వీట్ చేశారు. ఉడిపి కాలేజీ అధికార యంత్రాంగం అమ్మాయిలకు డ్రెస్ కోడ్ విధిస్తూ దాన్ని అనుసరిస్తూ తరగతులకు రావాలని ఆదేశించింది. భారత్ లో విపక్షాలు, నాయకుల ఈ ప్రచారాన్ని పొరుగుదేశం అందిపుచ్చుకుంది.
అందుకు ప్రియాంక గాంధీ ట్వీట్ ను షేర్ చేస్తూ.. “ముస్లిం బాలికలకు విద్యను దూరం చేయడం మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే. హిజాబ్ వద్దనడం వారి భయభ్రాంతులకు గురిచేయడమే, ఇది పూర్తిగా అణచివేత. ముస్లింలపై కక్ష సాధింపులో భాగంగా భారతదేశ ప్రణాళికలో ఇది భాగమని ప్రపంచం గ్రహించాలి’ అని అన్నారు. గతంలో మలాలా కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. భారత దేశంలోని ముస్లిం బాలికలకు విద్యను అందకుండా చేస్తున్నారని అన్నారు.
భారతదేశంలో ఏ ముస్లిం బాలికకు ఎవరూ చదువును దూరం చేయలేదు. ఈ దేశంలో లింగం, మతం, కులం, వర్గ భేదం లేకుండా పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించే చట్టం కూడా ఉంది. ఇప్పుడూ కర్నాటకలో వివాదం చేస్తున్న పిల్లలు చదువుకన్నా హిజాబుకే మొదటి ప్రాధాన్యత అని చెప్పడం మనం చూశాం.
ముస్లిం బాలికలు తమ తమ విద్యాసంస్థలు సూచించిన డ్రెస్ కోడ్లను పాటించకపోవడం వల్లే ఈ సమస్య . కానీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఘనకార్యాల వల్ల …పాకిస్తాన్, షా ఖురేషీ వంటి వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఖురేషీ మాత్రమే కాదు… అంతకుముందు ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ మతపరమైన కోణంలో చూపుతూ తప్పుడు ప్రచారం చేయడం మనం చూశాం. ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ కర్నాటక నేత మరింత ఆజ్యం పోశారు. ఓ విద్యార్థి
భారత జాతీయ జెండాను తొలగించి, దాని స్థానంలో కాషాయ జెండాను పెట్టాడని డికె శివకుమార్ ట్వీట్ చేశారు. పాకిస్థానీ హ్యాండిల్స్ వెంటనే దాన్ని తీసుకుని వైరల్ చేసింది. అయితే ఆ ఫొటో పూర్తిగా ఫేక్.. ఆ జెండా స్తంభం ఖాళీగా ఉంది. దానిమీద త్రివర్ణ పతాకం లేదు.
https://twitter.com/SMQureshiPTI/status/1491283745529565184?s=20&t=xGMeETSHtlYkn65pd8UJDQ