2022 సంవత్సరానికి గానూ పద్మఅవార్డులను ప్రకచించింది భారత ప్రభుత్వం. ఇటీవలే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ ప్రకటించారు. ఆయనతో పాటు రాధేశ్యాం ఖేమ్కా, ప్రభాఆత్రే,యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ లకు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు. వారితో పాటు గులాంనబీ ఆజాద్ కు సహా మొత్తం 17 మందికి పద్మభూషణ్ ఇస్తున్నారు. వారిలో బెంగాల్కు చెందిన విక్టర్ బెనర్జీ, బుద్ధదేవ్ భట్టాచార్య, మహారాష్ట్రకు చెందిన నటరాజన్ చంద్రశేఖరన్, సైరస్ పూనావాలా, యూపీ నుంచి రషీద్ ఖాన్, వశిష్ట్ త్రిపాఠి, తెలంగాణ నుంచి కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులు, రాజస్థాన్ నుంచి దేవేంద్ర జజారియా, రాజీవ్ మెహిషి, గుజరాత్ నుంచి స్వామి సచ్చిదానంద్, ఒడిశా నుంచి ప్రతిభా రాయ్, అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు సత్యా నాదేళ్ల, సుందర్ పిచాయ్, మెక్సికోకు చెందిన సంజయ రాజారాం(మరణానంతరం), పంజాబ్ నుంచి గుర్మీత్ బావా(మరణానంతరం) పద్మభూషణ్ ప్రకటించింది భారత ప్రభుత్వం.
ఇక మరో 107మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఒలంపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రా, నటి షాపుకారు జానకి, సోనూ నిగమ్…తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు పద్మ భూషణ్ అవార్డులు రాగా.. గరికిపాటి నరసింహారావు, మొగిలయ్య, పద్మజారెడ్డి, రామచంద్రయ్య, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్ హసన్(మరణానంతరం)ను పద్మశ్రీకి ఎంపికచేశారు.