ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. యూపీ మాజీ సీఎం దివంగత కల్యాణ్ సింగ్ కు ప్రకటించిన పద్మవిభూషణ్ ను ఆయన కుమారుడు రాజ్ వీర్ సింగ్ అందుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు చెందిన భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, సీఎండీ సుచిత్రా ఎల్లా రాష్ట్రపతి కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ స్వీకరించారు. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చొప్రా సహా పలువురు క్రీడాకారులు పద్మ పురస్కారాలు అందుకున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)