పద్మ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రాష్ట్రపతి కోవింద్ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి అందరిదృష్టినీ ఆకర్షించారు. ఆయనే 125 ఏళ్ల యోగాగురువు శివానంద స్వామి. కాశీకి చెందిన ఈ స్వామి…పురస్కారం తీసుకునేందుకు వెళ్తూ ప్రధాని మోదీ ముందు నేలపై వంగి నమస్కారం చేశారు. మోదీ కూడా లేచి ఆ పెద్దాయనకు ప్రతినమస్కారం చేశారు.
స్వామీ శివానంద యోగా గురువుమాత్రమే కాదు సమాజసేవకుడు కూడా.
వారణాసి, పూరి, హరిద్వార్, నబద్వీప్ మొదలైన ప్రాంతాలలో వెనుకబడినవర్గాల వారికి సేవ చేస్తుంటారు. 50 ఏళ్లుగా పూరీలో 400-600 మంది కుష్టు వ్యాధిగ్రస్తుల సేవలో ఉన్నారాయన..
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)