ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలు వినియోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో యుద్ధవిమానాలు ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లాయి. భువనేశ్వర్ నుంచి 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుంది. మొత్తం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్ నుంచి విమానాల్లో పంపారు.
సత్వరమే ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి ఈటల, సీఎస్ను ఆయన అభినందించారు.