
File Photo
ఆమ్ ఆద్మీ సర్కారుకు షాక్ ఇచ్చారు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. ప్రభుత్వ ప్రకటన పేరుతో సొంతపార్టీ ప్రచారానికి వెచ్చించిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. అందుకైన మొత్తం 97 కోట్ల రూపాయలను పార్టీ నుంచి వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాశారు. ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి 2016లో సుప్రీం కోర్టు,ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆప్ సర్కారు బేఖాతరు చేసిందని సక్సేనా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రకటనల పేరుమీద పార్టీ ప్రచారం చేసుకుందన్నారు. అయితే ప్రభుత్వ ప్రచార ఖర్చు వివరాలను అడిగే హక్కు లెప్ఠినెంట్ గవర్నర్ కు ఎక్కడిదని తిరిగి ప్రశ్నిస్తోంది ఆప్.