భారతదేశంలోని అత్యంత పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా మన తెలంగాణ బిడ్డ శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ కాలం పాటు బ్యాంకింగ్ రంగంలో నిపుణుడిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసులు శెట్టికి అత్యున్నత పదవి లభించింది. నిబద్ధత, నిజాయితీ, నైపుణ్యం కలిగిన బ్యాంకింగ్ నిపుణుడిగా ఆయనకి పేరు ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్స్ టెక్నాలజీ విభాగాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ హోదా లో సేవలు అందిస్తున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శ్రీనివాసులు శెట్టి కి చాలా మంచి పేరు ఉన్నది.
వివిధ స్థాయిల్లో దాదాపు 36 ఏళ్లపాటు సేవలందించారు.
ప్రస్తుత ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ 27వ ఛైర్మన్గా శ్రీనివాసులు శెట్టిని నియమించింది.
శ్రీనివాసులు శెట్టి నియామకం మీద ఆయన స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
జోగులాంబ గద్వాల జిల్లా, మనోపాడ్ మండలం, పెద్దపోతులపాడు గ్రామంలో జన్మించారు. ఆయన ఆలంపూర్లో అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏడో తరగతి వరకు చదివారు . ఆ తర్వాత హైస్కూల్, ఇంటర్మీడియెట్ గద్వాలలో పూర్తి చేశారు . హైదరాబద్ రాజేంద్రనగర్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ) పూర్తి చేశారు. అనంతరం బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించారు.
శ్రీనివాసులు శెట్టి చదువుకున్న అప్పర్ ప్రైమరీ పాఠశాలలో మిఠాయిలు పంచారు. స్థానిక స్టేట్ బ్యాంక్ అధికారులు అక్కడకు చేరుకుని సెలబ్రేషన్స్ నిర్వహించారు.