దేశసరిహద్దులను కాపాడే వాళ్లకు మెరుగైన సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. Boarder Roads Organisation (BRO) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడం తమ సమగ్ర రక్షణ వ్యూహంలో ప్రధానమైనదని స్పష్టం చేశారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్న బీఆరోఓను ప్రశంసించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధిని ప్రస్తావిస్తూ… దేశ సర్వతోముఖాభివృద్ధికి సింహద్వారంగా అవి మారాయన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యాపారం, ఆహార సరఫరా, వ్యూహాత్మక సైనిక అవసరాలు, పరిశ్రమలు, ఇతర సాంఘిక, ఆర్థిక ప్రగతి వంటివాటికి రోడ్లు చాలాముఖ్యమని అందువల్లే అక్కడ రోడ్లు, వంతెనల నిర్మాణంపై దృష్టి పెట్టామని అన్నారు రాజ్ నాథ్.