నీరవ్ మోడీ మరియు మొహుల్ చోస్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ₹13,500కోట్లు ఫ్రాడ్ కేస్ లో నిందితులు.నీరవ్ మోడీ బ్రిటన్ లో జైల్లో రోజులు గడుపుతున్నాడు. అతన్ని ఇండియా తీసుకురావడానికి దాదాపు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. త్వరలో అతన్ని భారత్ కి బ్రిటన్ అప్పగిస్తుంది.
ఇక పోతే మొహుల్ చోస్కి..అంటిగ్వా అనే దేశం 2018 పారిపోయాడు. అతను అక్కడ పౌరసత్వం సంపాదించాడు. చోస్కి ని కూడ భారత్ తీసుకురావడానికి మన పరిశోధనా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కానీ అక్కడ కోర్టులో కేసు నడుస్తున్నాది.
అంటిగ్వా లో చోస్కి లాయర్ అక్కడ టివి ల్లో మాట్లాడుతూ తన క్లయింట్ చోస్కి కి భారత్ లోని కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయి. ఇది రాజకీయప్రేరితమైన చర్య. అందువల్ల చోస్కి ని భారత్ పంపించవద్దు అని కోర్టును కోరుతున్నాను అని చెప్పాడు.
నా భర్త కనిపించడం లేదు అని మొన్న మే 25న అంటిగ్వా పోలీసులకు చోస్కి భార్య కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుండి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆమె ఫిర్యాదు పై స్పందిస్తూ బహుశా క్యూబా వెళ్ళాడేమో అని అంటిగ్వా ప్రధాని ప్రకటించారు.
అయితే అనుకోకుండా ఈ చోస్కి ని చట్ట విరుద్ధంగా తమ దేశంలో ప్రవేశించాడు అనే కారణం మీద డామినిక్ దేశ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది. చట్ట ప్రకారం చోస్కి ని భారత్ కు అప్ప చెపుతాం అని డామినిక్ దేశం ప్రకటించింది.
చోస్కి తరుపున లాయర్ మాట్లాడుతూ చోస్కి అంటిగ్వాలో ఒక రెస్టారెంట్ కి వెళ్తూ ఉండగా భారత్ అధికారులు అతన్ని చట్ట విరుద్ధంగా కిడ్నాప్ చేసి పడవలో డామినిక్ దేశానికి తీసుకుపోయి అరెస్ట్ చూపించారు. అతని కంటి మీద వంటి మీద గాయాలు ఉన్నాయి. అందువల్ల అతన్ని తిరిగి అంటిగ్వా దేశానికి సరెండర్ చెయ్యాలి కానీ భారత్ కి కాదు అని డామినిక్ ప్రభుత్వాన్ని ఆ లాయర్ కోరి అక్కడ హై కోర్టులో కేస్ వేసాడు.
శుక్రవారం డామినిక్ హై కోర్ట్ కేస్ వింటూ తాము ఈ కేస్ లో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు చోస్కిని భారత్ పంపించవద్దు అని, చోస్కిని ‘డామినిక్ చైనా ఫ్రెండ్షిప్ హాస్పిటల్’ కి ఆరోగ్య పరీక్షలు నిమిత్తం తరలించాలి అని పేర్కొంది.
అంటిగ్వా మీడియా కధనాలు ప్రకారం చోస్కి ని భారత్ కి అప్పగించడానికి వీలుగా భారత్ ప్రభుత్వం చోస్కి కేస్ కి సంబంధించిన కాగితాలు/ఆధారాలు ప్రత్యేక విమానంలో అంటిగ్వా పంపించినట్లు తెలుస్తోంది. అదే మీడియా రిపోర్ట్స్ ప్రకారం కతార్ ఎయిర్ వేస్ కి చెందిన ఒక విమానం డామినిక్ దేశంలో డగ్లస్-చార్లెస్ ఎయిర్ పోర్ట్ లో దిగినట్లు అది చోస్కి ని భారత్ తీసుకురావడానికి డామినిక్ దేశం వచ్చింది అని రాశారు. కతార్ కి చెందిన ఫ్లైట్ ఢిల్లీ విమానాశ్రయం నుండి మే 28 వ తేదీ మధ్యాహ్నం 3.30 కి బయల్దేరి మర్నాడు మధ్యాహ్నం 1.15కి డామినిక్ దేశం చేరినట్లు కతార్ ఫ్లైట్ ట్రావెల్ డేటా ఆ వార్తని బలపరుస్తోంది.
ఈలోగా అంటిగ్వా ప్రధాని, చోస్కి క్యూబా వెళ్ళాడు అనే మాట మారుస్తూ చౌస్కి తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మే 23 న టూర్ కి వెళ్లి అంటిగ్వా దేశ సరిహద్దులు దాటి డామినిక్ పోలీసులకు పట్టుబడ్డాడు అని చెప్పారు. డామినిక్ పోలీసులు అతన్ని భారత్ పంపించవచ్చు అని చెప్పారు. అంతే కాక చోస్కి కి ఇచ్చిన మా దేశ పౌరసత్వాన్ని తప్పకుండా రద్దు చేస్తాం అని చెప్పారు. ఈ చోస్కి మా దేశపు ప్రధాన విపక్షానికి ఆర్ధిక సహాయం చేస్తున్నాడు అందుకే మా విపక్షం చోస్కి కి మద్దత్తు గా మాట్లాడుతోంది అని కూడా ఆరోపించారు. మా దేశంలో ప్రస్తుతం అతనికి దేశ పౌరుడిగా అన్ని హక్కులు లభిస్తాయిఅందువల్ల చోస్కి ని మాకు కాకుండా నేరుగా భారత దేశం సరెండర్ చెయ్యమని డామినిక్ దేశాన్ని కోరాను అని చెప్పారు.
అంటిగ్వా ప్రధాన ప్రతిపక్ష నేత మాట్లాడుతూ ప్రస్తుత ప్రధానే అతనికి పౌరసత్వం ఇచ్చారు. భారత పౌరసత్వం రూల్స్ ప్రకారం ఇక్కడ పౌరసత్వం తీసుకుంటే భారత్ పౌరసత్వం రద్దు అయినట్లే. అందువల్ల చోస్కి పూర్తిగా అంటిగ్వా పౌరుడు. అటువంటి పౌరుడికి ఇక్కడ చట్ట ప్రకారం హక్కులు పొందకుండా ప్రధాని ఎలా అడ్డుకుంటారు అని ప్రధానిని విమర్శిస్తున్నారు.
ఈ దోపిడీ దారులు స్వంత దేశాల్లోనే కాదు విదేశాల్లో కూడా విపక్షాలను కొనగలరు అన్న మాట.
మొహుల్ చోస్కి ని భారత్ తీసుకురావడం అన్నది ఇప్పుడు డామినిక్ హై కోర్ట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది.
…చాడా శాస్త్రి..