మనిషి ఎంత స్థాయికి చేరుకున్నా తన మూలాలను, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐటీ సహా అన్ని రంగాల్లో హైదరాబాద్ పురోగతి సాధిస్తోందన్న ముర్ము…అన్ని అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు రాష్ట్రపతి . విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విశిష్టమైన సంస్కృతే భారతీయులకు ప్రత్యేక గుర్తింపు అని ఆమె అన్నారు. మన దేశంలో ప్రతిఊరినీగ్రామదేవత కాపాడుతూ ఉంటుందన్న భారత రాష్ట్రపతి సంస్కృతి పరిరక్షణ హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని గుర్తు చేశారు.
https://twitter.com/rashtrapatibhvn/status/1607661863868989440?s=20&t=rFj7lvAtMlKzB0OuoCDTpQ