సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వనుంది. ఆగస్టు 5న సాయంత్రం వర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
ఇప్పటివరకు పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది ఓయూ. చివరిసారిగా 2001లో ప్రముఖ భారత-అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ అరుణ్నేత్రావలి ఈ గౌరవం పొందారు. దాదాపు రెండుదశాబ్దాలకు మళ్లీ ఇప్పుడు జస్టిస్ రమణకు ప్రదానంచేస్తున్నారు.
ఇప్పటి వరకు 47 మందికి గౌరవ డాక్టరేట్లు ప్రకటించింది ఓయూ.. తొలిసారిగా 1917లో నవాబ్ జమాదుల్ ముల్క్ బహదూర్కు ఇచ్చింది. తర్వాత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, సి.రాజగోపాలాచారి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ వై.నాయుడమ్మ, డాక్టర్ మన్మోహన్సింగ్ వంటి ప్రముఖులెందరో ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు..