కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయం 7.00 గంటల వరకే పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. బీజేపీ తరఫున పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటిచేస్తున్న “మెట్రో మ్యాన్” ఈ శ్రీధరన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ సారి రాష్ట్రంలో అధికారం చేపట్టేది కూడా బీజేపీనే అని.. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కాగా, ఈ శ్రీధరన్ బీజేపీ తరఫున సీఎం అభ్యర్ధి అంటూ ప్రచారం జరిగింది. మరోవైపు ప్రముఖ నటుడు మోహన్ లాల్ కూడా శ్రీధరన్ సీఎం అయితే పాలన అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
కాగా, కేరళలో జరుగుతున్న 140 అసెంబ్లీ స్థానాలకు.. 957 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.2.74 కోట్ల మంది ఓటర్లు వారి ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.
https://twitter.com/ANI/status/1379244300798623744