యాసిన్ మాలిక్కు జైలు శిక్ష విధించడాన్ని తప్పుబట్టిన ఇస్లామిక్ సహకార సంఘంపై భారత్ మండిపడింది.
తీర్పును తప్పుపట్టడం ద్వారా ఈ సంఘం ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా సమర్థిస్తున్నారని మండిపడింది.
ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సమర్థించవద్దని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్-ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను భారత్ కోరింది.
వ్యాఖ్యల ద్వారా OIC-IPHRC పరోక్షంగా యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు తెలిపిందన్నారు. మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిపే అన్ని ఆధారాలతో కూడిన పత్రాలను న్యాయస్థానానికి సమర్పించినట్లు చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహించకూడదని ప్రపంచం కోరుకుంటోందని, ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ సమర్థించవద్దని ఓఐసీని కోరుతున్నామని చెప్పారు.
జమ్మూ-కశ్మీరు ఉగ్రవాది యాసిన్ మాలిక్కు టెర్రర్ ఫండింగ్ కేసులో యావజ్జీవ జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ఎన్ఐఏ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.