ఏడాది క్రితం చైనా నుంచి ముంచుకొచ్చిన కరోనా వైరస్ మనందరి జీవితాల్ని అతలాకుతలం చేసింది. మహమ్మారి ఇక తగ్గుముఖం పట్టిందీ అనుకున్న టైంలో మళ్లీ సెకండ్ వేవ్ అంటూ విలయతాండవం చేస్తోంది.అయినా సరే ఈ అతిపెద్ద సవాల్ ను దేశం దీటుగా ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ మన దేశంలో మొదలైంది. ఫ్రంట్ లైన్ వారియర్స్, వయోవృద్ధులకు ముందుగా టీకాలు వేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేస్తున్న దేశం భారత్ … ఇప్పటికే చాలా తక్కువ సమయంలోనే కోట్ల మందికి టీకాలు వేసిన ఘనత మనది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వ్యాక్సినేషన్ కొనసాగుతోంటే….ప్రపంచంలోనే అత్యంత చవగ్గా భారత్ వ్యాక్సిన్ ను అందిస్తోంది భారత్.
ఇక కరోనాతో ప్రపంచం అట్టుడుకుతున్న వేళ ప్రపంచంలో అందరికన్నా ముందు వాక్సిన్ కనుగొన్నది మనశాస్త్రవేత్తలే. మనదేశంలో కోవాక్సిన్ అందుబాటులోకి వచ్చాకనే…అమెరికా మోడెర్నాకానీ, రష్యన్ ఫైజర్, స్ఫుత్నిక్ లు గానీ, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వంటివి వచ్చాయి.
దేశం గర్వించదగిన ఆవిష్కరణ ఇది. కానీ మన సోకాల్డు మీడియాకు మాత్రం అతి అత్యంత సాధారణ విషయంగా అగుపించింది. మన శాస్త్రవేత్తల గొప్పతనం గురించి చెప్పడం రాలేదు కానీ వాక్సిన్ పట్ల ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాందోళనలు రేకెత్తించే ప్రయత్నం మాత్రం బాగా చేసింది. క్లినికల్ ట్రయల్స్ ను పూర్తిచేసుకుని, అన్ని పరీక్షలు దాటుకుని విజయవంతంగా టీకా బయటకు వచ్చింది.
80పైగా దేశాలకు వాక్సిన్ ను భారత్ సరఫరా చేసింది. ఆయా దేశాలు ఎంతగా కృతజ్ఞతలు తెలిపాయో మోదీకి, మనదేశానికి. బ్రెజిల్ ప్రధాని అయితే “హనుమంతుడు సంజీవని తెచ్చినట్టుగా భారత్ మా దేశానికి వ్యాక్సిన్ తెచ్చింది” అని ప్రశంసించారు. దాన్ని కూడా మన సోకాల్డు మీడియా అతి సాధారణ విషయంగానే చూసింది.
ముందుగా ఫ్రంట్ వారియర్స్ కు టీకా అంటే… శక్తివంచన లేకుండా దుష్ప్రచారం చేసిన ఘనత మన భారత సోకాల్డు మీడియాది. ఏదో భయంతోనో, ఇతర ఏవో కారణాలతోనే కళ్లు తిరిగిపడిపోయినా… చెమటలు పట్టినా, పెద్దవాళ్లకు కాస్త జ్వరం వచ్చినా దాన్నీ పెద్ద వార్తగా చూపారు.
ఇక కొన్నిరాష్ట్రాల ప్రభుత్వాల తీరూ అంతే…పెద్దవాళ్లకు వాక్సిన్ వేయండి ఇదిగో సరిపడా టీకా అని కేంద్రం పంపిస్తే…కనీసం బాధ్యతగా వ్యవహరించలేదు. అప్పటికే మీడియా వార్తలతో భయంవల్ల పెద్దగా ముందుకు రాలేదుచాలామంది. రాష్ట్రాల పాలకులూ తమదేం పోయిందన్నట్టుండిపోయాయి.
ఒక వ్యాక్సిన్ పది డోసులు, అంటే పది మందికి వస్తుంది. సీసా మూత తెరిస్తే, ఆరోజు పదిమందికి వ్యాక్సిన్ వేస్తేనే అది పూర్కి వినియోగం అయినట్టు. కానీ అనేక ఆసుపత్రుల్లో ఒక్క రోజులో పదిమంది కూడా వ్యాక్సిన్ వేసుకోక వృధాగా పడేసిన సందర్భాలేఅన్నీ,. కేంద్రం రాష్ట్రాలకు పంపిన వ్యాక్సిన్లలో 23 శాతం అంటే అక్షరాలా 44 లక్షల డోసుల వ్యాక్సిన్ పోయింది.
టీకా మీ ముంగిట అందుబాటులో ఉంచాం వేసుకోండి అని ప్రజలకు చెప్పలేని ప్రభుత్వాలు, ప్రజల్లో కనీస అవగాహన కల్పించి అపోహలు తొలగించే ప్రయత్నం చేయని మీడియా ..ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుంటే.,,,జనం పిట్టల్లా రాలుతుంటే… వాక్సిన్ల కొరతపై వార్తలు ప్రసారం చేస్తున్నాయి. నాడు బాధ్యత మరిచిన విపక్షాలు ఇప్పుడు ప్రధాని, కేంద్రం ఏం చేస్తున్నాయని దిగజారిని వ్యాఖ్యలు చేస్తున్నాయి.