బడ్జెట్పై విపక్షాల స్పందన.. దీదీ గుర్రు.. రాహుల్ ట్వీట్.. ఏచూరీ ఆగ్రహం
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మిశ్రమ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తుంటే.. విపక్షాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అసలు ఇదేం బడ్జెట్ అంటూ నిప్పులు చెరిగారు. “ఇదో నకిలీ బడ్జెట్.. రైతు వ్యతిరేక బడ్జెట్.. ప్రజా వ్యతిరేక.. దేశ వ్యతిరేక బడ్జెట్ అంటూ మండిపడ్డారు.పెట్రోలు, డీజిల్ ధరలపై సెస్ విధించారని.. ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తో తమ రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను క్రమక్రమంగా ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు.
ఇక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్పై తీవ్ర విమర్శలను గుప్పించారు. ఈ బడ్జెట్లో పేదలకు ఊతమిచ్చేలా ఎలాంటి ప్రకటన లేదన్నారు.పేదలకు
నగదు బదిలీ ప్రస్తావనే లేదని.. దేశ సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మరోవైపు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కూడా బడ్జెట్పై విమర్శలు చేశారు. కేంద్రం ఈ బడ్జెట్లో కేవలం పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు పెద్దపీట వేసిందంటూ ఆరోపించారు. ఈ బడ్జెట్లో సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్నారు. రక్షణ, ఇంధన, ఎయిర్పోర్ట్స్, రైల్వేలతో పాటుగా.. కీలక రంగాలన్నింటిని కేంద్రం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతోందని ఆరోపించారు.