కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయి విజయన్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.కేసులో కీలకనిందితురాలైన స్వప్న సురేష్ సీఎం పేరు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తప్పుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణలపై ఘాటుగానే స్పందించారు విజయన్. అన్నీ నిరాధార ఆరోపణలే అని తాను వీటిని పట్టించుకోబోననీ అన్నారు. ఇలాంటి నిరసనలు తనను, తన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవనీ అన్నారు. ప్రజామద్దతు మనకుందని..గత అసెంబ్లీ ఎన్నికలముందే ఇలాంటి ఆరోపణలు వచ్చినా ప్రజలు నమ్మకుండా తమకే మళ్లీ అధికారం అప్పగించారనీ విజయన్ గుర్తుచేశారు.