
Lt Gen YK Joshi
ఆపరేషన్ స్నో లెపార్డ్ ముగియలేదని, ఇంకా కొనసాగుతోందని… నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి అన్నారు. మంచుతో నిండిన ప్రాంతంలో భారత సైనికులు అప్రమత్తంగా ఉన్నారంటూ చైనాకు గట్టి మెసేజే పంపారు. జమ్ముకశ్మీర్ హెడ్ క్వార్టర్లో జరుగుతున్న నార్తర్న్ కమాండ్ ఇన్వెస్టిట్యూర్ సెర్మనీలో జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ లద్దాక్ లో పాల్గొన్న సైనికులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
https://twitter.com/NorthernComd_IA/status/1484801984222089217?t=R0wG8FX0iXPc36E3bggC_g&s=19
వాస్తవాధీన నియంత్రణ రేఖ దగ్గర ఆపరేషన్ స్నో లెపార్డ్ లో భాగంగా మోహరించిన యూనిట్ల సీవోలతో ఆయన మాట్లాడారు. భారత సైనికుడి పరాక్రమం, ధైర్యసాహసాలు, సంకల్పం చైనాకు గట్టి సందేశాన్నిస్తున్నాయన్నారు. అన్నివేళలా అప్రమత్తంగా ఉంటున్న భారత సైన్యం, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి… లద్దాక్ లోని పాంగోగ్ దక్షిణ తీరాన ఉన్న ముఖ్యమైన ప్రాంతాల్ని కలుపుకునేందుకు చేపట్టిన వ్యూహాత్మక చర్యల్లో భాగంగా 2020లో ఆపరేషన్ స్నో లిపార్డ ను ప్రారంభించింది. 2021 సంవత్సరం భారతదేశానికి ‘వాటర్ షెడ్’ అని చైనా దూకుడుకు భారతసైనికులు అపారమైన ధైర్యసాహసాలతో కళ్లెంవేశారని అన్నారు.
చైనా బలగాలు ఈస్ట్ లద్దాక్ వైపు న్యూమరస్ ఏరియాలో ఉన్నాయని….వాటిని తిప్పికొట్టేందుకు నిండామంచులో భారతదళాలు అప్రమత్తంగా ఉన్నాయని జోషి అన్నారు. ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సంసిద్ధంగా ఉందనే గట్టి సంకేతాన్ని ఇచ్చారు.
అటు పాకిస్తాన్ వెంబడి సరిహద్దులో పరిస్థితి అదుపులో ఉందని…పొరుగుదేశం చొరబాట్లును భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని అన్నారు. ఏడాది పాటు కాల్పుల విరమణ ఒప్పందంలో స్థానిక ప్రజల స్థితిగతులు మెరుగుపడుతున్నాయని అన్నారు. ప్రజలు ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అంగీకరించబోరని జోషి అన్నారు.
లద్దాక్, జమ్మూకశ్మీర్ విషయంలో ప్రాధాన్యతను బట్టి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ నార్తర్న బోర్డర్స్ సహా ఇతర ఆపరేషన్లు, కార్యకలాపాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 26 యూనిట్లకు చెందిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు జోషి.