పాకిస్తాన్ అంతు తేల్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది అందుచేతనే పాకిస్తాన్ వ్యవహారాన్ని అంతర్జాతీయ స్థాయిలో హ్యాండిల్ చేస్తున్నారు పాకిస్తాన్ ని నేల మీదకు తేవాలి అంటే ఇతర దేశాల నుంచి పెద్దగా సహాయం అందకూడదు. అప్పుడే పాకిస్తాన్ గిలగిలలాడి రోడ్డు మీదకు వస్తుంది. అందుకోసం ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
…………..
పాకిస్తాన్ ప్రత్యక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది అనేందుకు చాలా ఆధారాల్ని మోదీ ప్రభుత్వం సేకరించింది. పుల్వామా దాడి మేమే చేశామని పాకిస్తాన్ మంత్రి ఒప్పుకోవడం, ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనిక అధికారులు హాజరు కావడం, చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు కోట్ల రూపాయల పరిహారం ఇవ్వడం.. వంటి అంశాలను బాగా హైలైట్ చేస్తున్నారు. వీటి సహాయంతో పవర్ ఫుల్ గా ప్రజెంటేషన్లు తయారు చేస్తుంది. ప్రపంచంలోనే అగ్రదేశాల భాషల్లో ఈ ప్రెజెంటేషన్లు రెడీ అవుతున్నాయి.
……….
అఖిల దేశాలకు పాకిస్తాన్ వ్యవహారాన్ని తెలియపరిచేందుకు భారతీయ ఎంపీలతో టీమ్లను ఏర్పాటు చేశారు ఇందులో అన్ని పార్టీల నాయకులను జత కలుపుతున్నారు.
ఇందు కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్(భాజపా), బైజయంత్ పాండా (భాజపా), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రతి టీం లోను వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకున్నారు. వీళ్ళకు తోడుగా విదేశీ వ్యవహారాల నిపుణులను పంపిస్తున్నారు.
…….
వీరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం ఏడు గ్రూపులు 10రోజుల వ్యవధిలో ఏడు దేశాలకు వెళ్తాయి. ఈవిషయంపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరిపి బృంద సభ్యులను ఎంపిక చేసింది. వీరు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటివారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్లు సమాచారం.
…….
ఎంపీలు మరియు అధికారుల బృందం ఇప్పటికే ఈ విషయంలో హోంవర్క్ చేసుకుంటున్నది.
ముఖ్యంగా ఐదు అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు.
1) ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమైన పాకిస్థాన్ చెత్త పనులు
2) పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను ఎలా చేపట్టిందో వివరణ.
3) భవిష్యత్తులో భారత్ పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత.
4) ఉగ్రవాద స్థావరాల మీదనే దాడులు చేశామని, పౌరులకు హాని చేయలేదని స్పష్టత
5) పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలతో ప్రపంచ దేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించడం.
ఈ విధమైన ప్రచారంతో అగ్రదేశాల్లో పాకిస్తాన్ కు చెక్ పెట్టేందుకు వీలవుతుంది. అందుచేతనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రకమైన దౌత్యాన్ని ఎంచుకుంది.
….
ఇందులో ఇంకో లాభం కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ వంటి దేశభక్తి కార్యక్రమాల్లో అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేయడం. దీంతో భారతదేశం అంతా ఒకే మాట మీద ఉంది అన్న సంకేతాన్ని పంపించడానికి వీలవుతుంది. భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేయకుండా కంట్రోల్ చేయడం కూడా సాధ్యపడుతుంది. అందుకే ప్రధాని మోదీని అపర చాణుక్యుడు అని పిలిచేది.