అనారోగ్యంతో కన్నుమూసిన తల్లి పాడె మోశారు ప్రధాని మోదీ. అతి కొద్ది మంది సమక్షంలో.. ఆమె అంత్యక్రియలు జరిగాయి. కేవలం కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రధాని మోదీ తల్లి చితికి నిప్పంటించారు. హౌరా-న్యూజల్పాయ్గురి వందే భారత్ రైలుతో పాటు మెట్రో లైన్ను ప్రధాని ప్రారంభోత్సవం కోసం ఆయన ఈరోజు కోల్కతాకు వెళ్లాల్సి ఉండగా… తల్లి కన్నుమూతతో కోల్ కతా టూర్ చివరినిమిషంలో రద్దైంది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.